AP – Telangana : ఏపీతో తెలంగాణ బంధం ఇక పూర్తిగా తెగినట్టే

అయితే తాజాగా హైదరాబాద్ పై దానికి గల హక్కుకు సంబంధించిన గడువు కూడా పూర్తి కావడంతో.. ఏపీకి సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా రాజధానిలో కనుమరుగు కానున్నాయి.

Written By: NARESH, Updated On : May 16, 2024 2:50 pm

Telangana's relationship with AP is completely severed

Follow us on

AP – Telangana  : ఏపీ,తెలంగాణ మధ్య పరిపాలన సంబంధమైన బంధం ఇక నుంచి పూర్తిగా తెగిపోనుంది. పదేళ్ల పాటు ఏపీ,తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇక నుంచి పూర్తిస్థాయి తెలంగాణ క్యాపిటల్గా కొనసాగునుంది. ఏపీ రీ-ఆర్గనేజేషన్ యాక్ట్ ప్రకారం దశాబ్దం పాటు భాగ్యనగరంపై ఏపీకి హక్కు ఉండింది. అందులో భాగంగానే పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ కు పలు కీలక భవనాలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. వీటితో పాటు పలు కార్పోరేషన్లకు బిల్డింగులు,ఉద్యోగుల కేటాయింపు జరిగింది. అయితే ఏపీ రీ-ఆర్గనైజేషన్ ఆక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటన్నిటిని ప్రస్తుతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ భగవంతులను తెలంగాణ సర్కారుకు అప్పగించాల్సి ఉంటుంది. జూన్ రెండో తేదీ నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈనెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించబడే భవనాలకు సంబంధించిన అంశంపై చర్చించాలని సీఎం నిర్ణయించారు. క్యాబినెట్ సమావేశంలోగా పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన భవనాల పూర్తి వివరాలు రెండు రాష్ట్రాల మధ్యన కామన్గ కేటాయించబడిన ఎంప్లాయిస్ డీటెయిల్స్ ను మంత్రివర్గం ముందు ఉంచాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఆలోగా ఏపీకి కేటాయించబడిన లేక్ వ్యూ అతిథి గృహం,ఇతర కార్పొరేషన్ భవంతులను గడువు తీరిన వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి స్వాధీనం చేసుకున్న భవంతులు,స్థలాలను తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా కేటాయించుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సూచించారు. తద్వారా ప్రభుత్వానికి పరిపాలనపరంగా మరింత వెసులుబాటు దొరికేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. అందువల్ల అధికారులు ఆ దిశగా వెంటనే కసరత్తును మొదలుపెట్టాలన్నారు.

ఏపీతో తెగిన పరిపాలన అనుబంధం..!

దాదాపు దశాబ్ద కాలం పాటు ఏపీ రీ -ఆర్గనేషన్ ఆక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ పై హక్కు ఉన్నప్పటికీ.. ముందుగానే ఏపీ తన కార్యకలాపాలను తాడేపల్లిగూడెం వేదికగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్ పై దానికి గల హక్కుకు సంబంధించిన గడువు కూడా పూర్తి కావడంతో.. ఏపీకి సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా రాజధానిలో కనుమరుగు కానున్నాయి.