Homeఆంధ్రప్రదేశ్‌Prajagalam: మోదీ సభలో భద్రతా వైఫల్యం

Prajagalam: మోదీ సభలో భద్రతా వైఫల్యం

Prajagalam: ఏపీలో పోలీస్ శాఖ వైఫల్యం మరోసారి బయటపడింది. ముప్పేట విమర్శలను ఎదుర్కొంటోంది. జగన్ పాలన ముగిసినా.. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి యంత్రాంగం వెళ్ళినా.. ఏపీ పోలీస్ శాఖ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వానికి సలాం చేస్తుండడం విశేషం. నిన్న చిలకలూరిపేట సభలో ప్రధాని పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ పోలీస్ శాఖ భద్రత వైఫల్యం స్పష్టంగా వెలుగు చూసింది. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సైతం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

ఏపీలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ మూడు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార సభను నిన్న చిలకలూరిపేటలో నిర్వహించారు. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాధారణంగా ప్రధాని పర్యటనకు అసాధారణ భద్రత కల్పించాలి. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీస్ శాఖ సహకారం అందించాలి. ప్రధాని వ్యక్తిగత భద్రతను కేంద్ర బలగాలు చూసుకోగా.. సభా పరంగా భద్రతను చూడాల్సిన ఏపీ పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్లో.. సభను పలుచన చేయడానికి పోలీస్ శాఖ ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదం అవుతోంది. సభను ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లేనిపోని రూల్స్ పెట్టి సభకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టారని మూడు పార్టీల శ్రేణులు ఫిర్యాదు చేస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందికి దిశా నిర్దేశం చేయలేదని సమాచారం. అటు సభా ప్రాంగణంలో ప్రజలను నియంత్రించే ఎటువంటి చర్యలు చేపట్టలేదని.. చివరకు లైట్స్ టవర్ ఎక్కిన వారిని దించే ప్రయత్నం చేయలేదని.. ప్రధాని మోదీ స్వయంగా వారందరినీ కిందకు దించాలని సూచించాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అందుకే ప్రధాని భద్రతా సిబ్బంది ఈసీకి ఒక నివేదిక పంపించనున్నట్లు సమాచారం.

వాస్తవానికి పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న విమర్శ ఉంది. గతంలో ఆయన వైసీపీకి ఫేవర్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని టిడిపి నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లోనే చిలకలూరిపేట సభ జరగడంతో.. ఆయన చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. ఒకవైపు ప్రధాని భద్రతా సిబ్బంది, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులకు సిద్ధపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ముంగిట ఇలాంటి చిత్రవిచిత్రాలు మరిన్ని ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version