Homeఆంధ్రప్రదేశ్‌Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో మలుపు..కీలక ఆదేశాలు!

Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో మలుపు..కీలక ఆదేశాలు!

Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు. మృతి పై ఎన్ హెచ్ ఆర్ సి కీలక ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డిజిపితో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్రమంగా అపహరించారని.. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసారని.. ఆ కారణంగా ఆయన మరణించారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు వెళ్ళింది. దీనిపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో డిజిపి తో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దీనిపై.

అదృశ్యం కాస్త.. కస్టోడియల్ టార్చర్..
హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనపై. తొలుత అదృశ్యం కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగింది. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయిస్తే తక్షణం సాయి కృష్ణను కోర్టులో హాజరు పరచాలని గడువు విధించారు కూడా. కానీ ఇంతలో ఈ ఘటన తీవ్రత పెరగడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసింది. రిమాండ్ రిపోర్టును ఇచ్చే క్రమంలో నాగరాజును కస్టోడియల్ టార్చర్ చేసి చంపేశారని స్పష్టం చేసింది. దీంతో సాయి కృష్ణ చనిపోయాడని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లింది. ఈ నేరాన్ని దాచేందుకు కొందరు పోలీస్ అధికారులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై స్మశానానికి తీసుకెళ్లి.. కాల్చి అవశేషాలను నదిలో కలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు తో పాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతరులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని.. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు.

తీవ్ర స్పందన..
ఈ ఫిర్యాదు పై తీవ్రంగా స్పందించింది మానవ హక్కుల కమిషన్. అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, కస్టోడియల్ డెత్.. రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత విలువైన జీవించే హక్కు పై ప్రత్యక్ష, ఘోరమైన దాడిగా అభిప్రాయపడింది. పోలీసులపై వచ్చిన ఆరోపణలు, అధికార దుర్వినియోగం, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలపై నమ్మకం కోల్పోవడానికి ప్రతి పంపిస్తున్నాయని.. సంరక్షకులే కుట్ర దారులు అయ్యారని తీవ్రంగా ఆక్షేపించింది మానవ హక్కుల కమిషన్. అందుకే సాయి కృష్ణ అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, మరణం, మృతదేహం తరలింపునకు బాధ్యులైన పోలీస్ అధికారులు వివరణ చెప్పాలని స్పష్టం చేసింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular