Other State Leaders On AP Politics: ఏ రాష్ట్రంలోనైనా రాజకీయం ప్రతిపక్షం చేస్తుంది. అధికారపక్షం తీరును ఎండగడుతుంది. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి విభిన్నం. 39 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కోసం గట్టిగానే పోరాటం చేస్తోంది. హోదా వస్తే కానీ సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించలేనని చెప్పి తప్పుకుంది. ప్రెస్ మీట్ లు, సోషల్ మీడియాలో పోస్టులకు పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ రాజకీయ శూన్యతను భర్తీ చేస్తున్నారు ఇతర ప్రాంతాల వారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఘోర తప్పిదాలు జరిగితే ప్రశ్నించని వీరు.. ఇప్పుడు మాత్రం అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై విశ్లేషణలు, విమర్శలు మాత్రం పురుగు రాష్ట్రాల నేతలు, ఇతర ప్రాంతాలకు చెందిన మేధావుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతా పక్క రాష్ట్రం వారే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే పోరాటం చేయనని మారం చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్, నటుడు ప్రకాష్ రాజ్, తెలంగాణ నేత కేటీఆర్, ఘంటా చక్రపాణి, తెలకపల్లి రవి వంటి వారు ఏపీ రాజకీయాల కోసం విపరీతమైన విశ్లేషణ చేస్తున్నారు. అది కూడా వన్ సైడ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బూతులు మాట్లాడినప్పుడు, ఘోరాతి ఘోరమైన రాజకీయాలు చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరవలేదు. పైగా లోకమంతా భయపడి ఆందోళన చెందిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు అడ్డగోలుగా సమర్ధించారు. ఏపీలో రాజకీయ అస్తిత్వాన్ని సృష్టించేందుకు సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు. ఆధారాలు లేని వాటిని లీకులుగా బయటపెడుతున్నారు. వాటిపై కేసులు పెడుతుంటే ఊహానా మేధావుల రూపంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఏపీ రాజకీయాలపై విశ్లేషణలు చేస్తున్నారు.
ప్రజల సమస్యలపై కాకుండా..
ప్రస్తుతం మేధావుల ముసుగులో జరుగుతున్న చర్చలు అర్థవంతంగా లేవు. పోనీ ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్లు, రోడ్లు, ఉద్యోగ ఉపాధి సమస్యల గురించి మీరు ప్రస్తావించడం లేదు. అమరావతి పై విషం కక్కుతుంటే ఈ మేధావులకు కనిపించడం లేదు. ఏపీలో ప్రతిపక్షం ఉందా లేదా అన్నట్టు ఉంది. హైదరాబాదులో కూర్చున్న నేతలు, మేధావులు ఏపీ రాజకీయాలపై రియాక్ట్ అవుతున్నారు. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నది బహిరంగ రహస్యం. తప్పకుండా తన బాధ్యతను మరిచి వేరొకరికి అప్పగించినట్టు ఉంది వైసీపీ పరిస్థితి. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్ష వైసిపిది. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొని వేరే రాష్ట్రాల నేతలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పగించినట్లు ఉంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళితే మాత్రం నష్టం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే..
