Hanging Coffins Tradition: ఏ మనిషికైనా సరే చావు అనేది కచ్చితంగా వస్తూ ఉంటుంది.. పుట్టుక గురించి తెలుస్తుంది గానీ.. చావు గురించి తెలియదు. చనిపోయిన తర్వాత మృతదేహాలను వారి వారి ఆచారాల ఆధారంగా ఖననం లేదా దహనం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భద్రపరుస్తూ ఉంటారు. ఈజిప్ట్ లాంటి ఏరియాలలో పిరమిడ్ల మాదిరిగా రూపొందిస్తుంటారు. చనిపోయిన వ్యక్తి తాలుకు జ్ఞాపకాలను భద్రపరచుకోవడంలో ఒక్కో దేశంలో ఒక్కో తీరైన ఆచారం కొనసాగుతూ ఉంటుంది.
మనదేశంలో చనిపోయిన వారి పార్థివదేహాలను దహనం లేదా ఖననం చేస్తూ ఉంటారు. కొన్ని మతాల సాంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి అస్థికలను నదులలో కలుపుతుంటారు. పితృ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఖననం చేస్తుంటారు. ప్రత్యేకంగా తయారుచేసిన శవపేటికలలో మృతదేహాలను భద్రపరిచి.. ఆ తర్వాత భూమిలో గొయ్యి తీసి.. మట్టి కప్పి పెడతారు. ఆ తర్వాత దానిమీద సమాధులు నిర్మిస్తారు. ప్రతి ఏడాది వారి జయంతి రోజున.. వర్ధంతి రోజున స్మృత్యర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
పిలిపిన్స్, ఇండోనేషియా, చైనా ప్రాంతాలలో మాత్రం ఇందుకు విరుద్ధమైన సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ శవపేటికలను గాలిలో వేలాడదీస్తారు. ఈ ఆచారం అక్కడ చాలా సంవత్సరాలుగా ఉంది. అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను భూమిలో పాతిపెట్టారు. కొండ అంచుల దాకా లేదా గుహల గోడలకు వేలాడదీస్తూ ఉంటారు. శవపేటికలు ఎంత ఎత్తులో ఉంటే.. ఆత్మలు అంత త్వరగా స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతుంటారు. ఈ పద్ధతిని మృతదేహాలను యానిమల్స్ నుంచి రక్షించుకోవడానికి సహాయపడుతుందని అక్కడివారు నమ్ముతుంటారు.. పైగా శవపేటికలను వేలాడదీస్తున్నప్పుడు అక్కడివారు ప్రత్యేకమైన పూజలు జరుపుకుంటారు. బంధువులు తప్ప మిగతావాళ్లు అక్కడికి రారు.
శవపేటికలను గాలిలో వేలాడదీసిన తర్వాత.. ఈ విషయాన్ని చాలా రోజుల తర్వాత బయటకు చెబుతారు. వర్ధంతి లేదా జయంతి రోజు అక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.. వారి వారి స్తోమతకు తగ్గట్టుగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేస్తారు. శవపేటికలు అక్కడ గాలిలో వేలాడుతూ ఉండడం కొంతమందికి భయం కలిగిస్తు ఉంటుంది. రాత్రిపూట అక్కడికి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆత్మలు అక్కడ సంచరిస్తాయని.. రాత్రిపూట అక్కడి వాతావరణం చాలా విచిత్రంగా మారుతుందని స్థానికులు చెబుతుంటారు. ఆ టైంలో అక్కడికి గనుక వెళ్తే గుండెలు గులాబ్ జాములు అయిపోతాయని భయపడుతుంటారు.

