Homeఆంధ్రప్రదేశ్‌New Teachers Joining: ఏపీలో విధుల్లోకి కొత్త గురువులు!

New Teachers Joining: ఏపీలో విధుల్లోకి కొత్త గురువులు!

New Teachers Joining: ఏపీలో మెగా డీఎస్సీ( Mega DSC) పరి సమాప్తం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులు ఈరోజు విధుల్లో చేరారు. కొద్ది రోజుల కిందట నియామక పత్రాలను అందించిన సంగతి తెలిసిందే. ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ సైతం పూర్తయింది. దీంతో ఈరోజు తమకు కేటాయించిన పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆరు నెలల వ్యవధిలో డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఉపాధ్యాయులందరికీ పోస్టింగులు ఇచ్చింది. ఈ విషయంలో మాత్రం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అభినందనలు అందుకుంటున్నారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి.. సకాలంలో డీఎస్సీ పూర్తి చేయడంలో ఆయన కృషి ఉందని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..
అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే తొలి ఫైల్ గా సంతకం చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తి చేశారు. అన్ని రకాల నిబంధనలను అనుసరించి.. ఈ ఏడాది ఏప్రిల్ 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు నెల రోజులపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షలు కూడా పూర్తి చేశారు. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రకరకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ పై న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ నిబంధనల ప్రకారమే ముందుకెళ్లడంతో డీఎస్సీ సజావుగా సాగింది. అయితే కొన్ని పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 15941 పోస్టులు భర్తీ అయ్యాయి. మెగా డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులు ఈరోజు విధుల్లో చేరారు.

మాట తప్పిన జగన్ మోహన్ రెడ్డి..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు చేయలేకపోయారు. ఒక్కటంటే ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా రాలేదు. చివరిగా 2024 ఎన్నికలకు ముందు ఆరువేల ఉపాధ్యాయ పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ప్రక్రియ ప్రారంభం కాక మునుపే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. అయితే చంద్రబాబు మెగా డీఎస్సీ హామీ ఇవ్వడం.. ఆ హామీని అమలు చేస్తూ 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేయగలిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 మందికి పైగా కొత్త ఉపాధ్యాయులు ఈరోజు విధుల్లో చేరారు. అయితే తమ ఆశయం నెరవేరడంతో ఉద్విగ్న భరిత వాతావరణంలో వారు పాఠశాలల్లో విధుల్లో చేరడం కనిపించింది. గొప్పగా ఎమోషనల్ అయిన వారు కూడా ఉన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version