Homeఆంధ్రప్రదేశ్‌Midday Meal Scheme: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 1.40 లక్షల మందికి లబ్ది!

Midday Meal Scheme: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 1.40 లక్షల మందికి లబ్ది!

Midday Meal Scheme: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు కేజీబీవీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీలో ప్రధానంగా ఇంటర్ విద్యార్థులకు సంబంధించి చర్చ వచ్చింది. మధ్యాహ్న భోజనం ప్రారంభించాలన్న ప్రతిపాదన రావడంతో క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు లక్షణాలపై వేలమంది ఇంటర్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

* అప్పట్లో టిడిపి ప్రభుత్వంలోనే
వాస్తవానికి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. దీంతో లక్షలాదిమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. సాధారణంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గ్రామీణ విద్యార్థులే అధికంగా ఉంటారు. పేద సామాన్య విద్యార్థులు చదువుతుంటారు. వీరంతా ఉదయమే గ్రామాల నుంచి బయలుదేరి కాలేజీలకి చేరుతారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజన పథకం ఉంటే వీరికి ఎంతో ప్రయోజనం. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడంతో ఎంతో ప్రయోజనకారిగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం పున ప్రారంభించాలన్న విన్నపాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు తిరిగి ఈ పథకం ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

* మంత్రి లోకేష్ చొరవ
పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనఈ కీలక ప్రకటన చేశారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ ఆమోదం ముద్ర లభించడంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని.. ఇంటర్ బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ పథకం అమలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version