పవన్ కల్యాణ్ పై లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని ఆయన విష వృక్షం నీడలో ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఆన్ లైైక్ టికెట్లు ప్రక్రియపై నిర్ణయం తీసుకుందన్నారు. ఒక నాయకుడిగా ముందుకు వెళ్లాలనుకుంటున్న పవన్.. దొంద టికెట్ల అమ్మకాలకు మద్దుతుగా నిలిస్తే లీడర్ ఎలా అవుతారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. నాయకులు అయిన వాళ్లు మంచి వైపు నిలబడాలని అన్నారు.

జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసిందని ఆయన మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. జగన్ కు ప్రజల మద్దతు ఉందని.. ఆయన జోలీకి ఎవరూ రాలేరని అన్నారు. పది అడుగుల పాదయాత్ర చేసి జనం ఎక్కువగా కనిపిస్తే కారు ఎక్కే పవన్ జగన్ మాదిరిగా ప్రజల్లో ఉంటూ సుదీర్ఘ పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. అసలు పవన్ తాను ఏం సిద్ధాంతం ఎన్నుకున్నారో ఆయనకే స్పష్టత లేదన్నారు.
కమ్యూనిస్టులు, టీడీపీలతో కలిసి పనిచేసిన వ్యక్తి టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అలాగే క్యారెక్టర్ లేని పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం తన వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మహిళలపై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్న పవన్ ముందు తన ద్వారా నష్టపోయిన మహిళల గురించి ముందు మాట్లాడాలన్నారు. పవన్ కు మనసనేదేలేదు ఆయన మహిళలను ఏవిధంగా హింసించారో ప్రజలే చూస్తున్నారని అన్నారు.