Homeఆంధ్రప్రదేశ్‌Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన అత్తింటి వారిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై గృహహింసకు పాల్పడ్డారని.. అదనపు కట్నం కోసం వేధించారని.. చివరకు చంపేందుకు కూడా ప్రయత్నాలు చేశారని ఆమె ఆరోపించారు. తన భర్త శారీరక సమస్యను కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వారు హిందువులు కాదని.. క్రిస్టియన్లు అంటూ ఆరోపించడం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. అయితే జోగి రమేష్ ఒక్కరే కాదు.. ఆ పార్టీలో చాలామంది నేతలు క్రిస్టియన్ మతం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

* జగన్ ప్రాపకం కోసం..
మత స్వీకరణ అనేది ఎవరి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసమే వైసీపీ నేతలు క్రిస్టియన్ మతంలోకి మారిపోయారు అంటూ కొత్త చర్చ ప్రారంభం అయింది. అయితే వారు బయటకు హిందువులు గాను.. లో లోపల మాత్రం క్రిస్టియన్ లాగా చలామణి అవుతున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు జోగి రమేష్ కోడలు మేఘన ఆ విషయాన్ని బయటపెట్టారు. తనను సైతం బలవంతంగా క్రిస్టియన్ మతంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ప్రాచీన సాంప్రదాయాలు, హిందూ పండుగలను ఆచరిస్తున్నట్లు కనిపించిన ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం.. ఇప్పుడు రహస్యంగా మతం మారినట్లు బయటకు వచ్చింది. ప్రజాప్రతినిధులుగా సమాజంలో చలామణి అవుతున్న నాయకులు తమ వ్యక్తిగత లేదా ఆధ్యాత్మిక నిష్ఠలను పారదర్శకంగా వెల్లడించకుండా.. దాచిపెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు.

* ఏకంగా దుర్గమ్మ వద్ద ప్రమాణం..
కొద్ది రోజుల కిందట నకిలీ మద్యానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి జోగి రమేష్ పై. ఈ పరిస్థితుల్లో ఆయన విజయవాడ దుర్గమ్మ సన్నిధికి వచ్చి ప్రమాణం చేశారు. ఈ విషయంలో కూటమి నేతలకు సవాల్ కూడా చేశారు. తానేమి తప్పు చేయలేదని నాడు దుర్గమ్మ సన్నిధికి వచ్చి కుటుంబ సభ్యులతో సహా ప్రమాణం చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ వెంట ఉన్న కోడలు మేఘనా ఇప్పుడు.. నేరుగా కుటుంబం మతమార్పిడి చేస్కుందని ఆరోపించడం సంచలనం అవుతుంది. అంటే ఒక మతంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకో మత విశ్వాసాలను అనుసరించి ప్రమాణానికి సిద్ధపడటం వెనుక ఒక కుట్ర ఉంది అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అయితే ఒక్క జోగి రమేష్ తో మాత్రమే ఇది ఆగిపోలేదు. వైసీపీలో చలామణి అయిన చాలామంది నేతలు ఇలా సీక్రెట్ గా మతమార్పిడులు చేసుకున్నారనేది ఒక ప్రధాన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సాన్నిహిత్యం పొందడానికి, పార్టీతో పాటు పదవుల కేటాయింపులు ప్రాధాన్యత దక్కించుకోవడానికి ఇటువంటి మతమార్పిడులు జరిగాయని అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అధిష్టానానికి అనుకూలంగా మా గ్రామంలో నేతలు తమ కుటుంబాల ఐడెంటిటీని, విశ్వాసాలను మార్చుకోవడానికి సిద్ధపడ్డారని అభిప్రాయం బలపడుతోంది. మరి తెర వెనుక ఏం జరిగిందో ఆ దేవుడికి ఎరుక.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
[td_block_15 category_id="_related_tag" custom_title="Related News" ajax_pagination="next_prev" limit="3"]