Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ..!

Jagan: జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ..!

Jagan: జగన్ ( Y S Jagan Mohan Reddy ) విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందా? అనవసరంగా ఆయనకు హైప్ చేస్తున్నామని భావిస్తోందా? అందుకే ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించదలచుకోలేదా? పోలీస్ ఆంక్షలు విధిస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి హడావిడి లేదు. దానికి కారణం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆంక్షలు లేకపోవడమే. పోలీసులు ఇట్టే అనుమతులు ఇవ్వడమే. దీంతో జగన్మోహన్ రెడ్డి తన షెడ్యూల్ ప్రకటించుకున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగన్ కృష్ణాజిల్లా వెళ్తున్నారని అసలు ప్రచారం జరగలేదు. దీంతో ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. కూటమి వ్యూహం మార్చడంతో జగన్కు ఉన్న ప్రచారం పడిపోయింది.

* ప్రచార యావతో..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీకి ప్రచార యావ ఎక్కువ. జగన్ బయటకు అడుగుపెడితే జనం తప్పదు. జన సమీకరణ చేయాల్సిందే. ఆది నుంచి ఆ పార్టీకి అది అలవాటు కూడా. సానుభూతి అనే పునాదితో ఏర్పడింది ఆ పార్టీ. రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక వర్గం ప్రజలు విపరీతమైన అభిమానాన్ని చాటుకుంటారు. ఈ క్రమంలో ఆ సానుభూతి, అభిమానం కొనసాగాలంటే జన సమీకరణ అనేది నిత్యం జరగాల్సిన కార్యక్రమం గా వైసీపీ భావిస్తుంది. అయితే గత 17 నెలల కాలంలో జగన్ బలప్రదర్శనకు దిగడాన్ని కూటమి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డికి అధిక ప్రచారం దక్కింది. అందుకే ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇకనుంచి జగన్ పర్యటనలకు ఎటువంటి అడ్డంకులు, షరతులు విధించకూడదని భావిస్తోంది.

* మారిన ప్రభుత్వ ఆలోచన..
జగన్ పర్యటనలకు ప్రభుత్వం షరతులు విధిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వినియోగించుకుంటుంది. ఆ పార్టీకి సోషల్ మీడియా( social media) బలం ఉంది. ఆపై ఐపాక్ టీం సేవలందిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య దృష్ట్యా కొన్ని రకాల షరతులు విధిస్తుండగా.. దానిని జవదాటి ప్రవర్తిస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దీంతో అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతోంది. అధినేత విషయంలో అతిగా ప్రవర్తించే వైసీపీ శ్రేణులు రాజకీయంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఘోర ఓటమి నుంచి తక్కువ రోజుల్లోనే వైసిపి తేరుకోగలిగింది. దానికి కారణం ప్రభుత్వ అతి జోక్యమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి పర్యటనల విషయంలో మామూలుగానే ఉండాలని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈరోజు తుఫాను బాధితులను పరామర్శించనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి అడ్డంకులు, ఆంక్షలు లేకపోవడంతో దానికి ప్రచారం కూడా లేదు. కూటమి ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version