YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి క్లాస్ పీకారా? పార్టీలో యాక్టివ్ విషయంలో సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారా? ఇదే పరిస్థితి మరో మూడు నెలలు కొనసాగితే గుడివాడకు కొత్త ఇన్చార్జిను నియమించే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జగన్ మోహన్ రెడ్డితో కొడాలి నాని భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాల గురించి చర్చించినట్లు సమాచారం. ఏమాత్రం పనితీరు బాగాలేదని.. ఇలా అయితే మార్చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. అయితే జగన్ ఈ నిర్ణయానికి రావడం వెనుక చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. పార్టీ ఓడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్న కొడాలి నాని నియోజకవర్గానికి అందుబాటులోకి రాకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..
* బిజెపిలో చేరుతారని ప్రచారం..
అయితే ఇటీవల కొడాలి నాని బిజెపిలో చేరుతారని ఒక ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగింది. మహారాష్ట్రకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆలయాల సందర్శనకు వెళ్లారు. అయితే అంతకుముందు కొడాలి నానిని పిలిచి జగన్ ఒక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఈసారికి గుడివాడని విడిచిపెట్టి విజయవాడ ఎంపీ కి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొడాలి నాని ఒక్కసారిగా రియాక్ట్ అయినట్లు సమాచారం. బిజెపి నేతలతో తిరగడం ద్వారా పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇస్తే.. జగన్మోహన్ రెడ్డి తన లైన్లోకి వస్తారని కొడాలి నాని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొడాలి నాని తన తమ్ముడి కుమారుడ్ని వారసుడిగా ఏకపక్షంగా ప్రకటించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టినట్లు తెలుస్తోంది.
* వంశీ పరిస్థితి వస్తుందని..
గన్నవరంలో నెలల తరబడి వల్లభనేని వంశీ మోహన్ అందుబాటులోకి రాలేదు. దానికి కారణం ఆయన నాలుగు నెలల పాటు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. కనీసం గుర్తుపట్టలేని విధంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు . తనపై కూడా అనేక రకాల కేసులు ఉండడంతో వల్లభనేని వంశీ పరిస్థితి తనకు ఎదురవుతుందని కొడాలి నాని కి తెలుసు. పైగా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పట్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గుడివాడలో నెగ్గుకు రావడం అంత సులువు కాదు అని కొడాలి నాని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన నియోజకవర్గం మొఖం చూడడం లేదని సమాచారం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇటీవల పిలిపించుకొని పూర్తిగా మాట్లాడినట్లు.. మరో నెల రోజుల్లో యాక్టివ్ కాకుంటే తన నిర్ణయం తాను తీసుకుంటానని ముఖం మీద చెప్పినట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
