Jagan strategy against Lokesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్యలాంటివి. కచ్చితంగా ఆ పార్టీ ఎన్నికల్లో గెలవాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ప్రస్తుతం కూటమి అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాదిరిగా ప్రభుత్వంపై అయితే అంత వ్యతిరేకత లేదు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి కలవరపాటుకు గురి చేసే అంశమే. అందుకే వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోదించడం ద్వారా అధికారంలోకి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. కనీసం ఎంపిక చేసిన వంద నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా ఈసారి మంగళగిరి పై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క మంగళగిరి మాత్రమే కాదు కూటమి ఎలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
నియోజకవర్గంలో సర్వే..
ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ పనితీరు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పురోగతి వంటి అంశాలతో కూడిన ఈ సర్వే చాలా గోప్యంగా సాగినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో 90000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు లోకేష్. అంతకుముందు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. కానీ ఐదేళ్లు తిరిగిన తరువాత అదే లోకేష్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పాలన అందిస్తున్నారు. దీంతో తిరుగులేని నాయకుడిగా మారిపోయారు. అయితే ఆదిలోనే లోకేష్ కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని, కొత్త వ్యక్తిని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త అభ్యర్థులకు..
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత నేతలను రంగంలోకి దించితే వారిపై నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది ప్రజలకు. అందుకే ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు జగన్. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తన కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ప్రారంభం అయింది. చాలా రహస్యంగా నియోజకవర్గంలో ఒక సర్వే పూర్తి కూడా చేసినట్లు తెలుస్తోంది.
వైయస్ ఫ్యామిలీ నుంచి..
వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ అంతంత మాత్రమే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే గెలిచింది. చాలాసార్లు ఓడిపోయింది ఆ పార్టీ. అటువంటి నియోజకవర్గం చేశారు. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఉంటూ పోటీ చేశారు లోకేష్. 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం 90 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. ఆ మెజారిటీని తగ్గించి లోకేష్ ను ఓడించడం అంత సులువు కాదు. అందుకే వైయస్ ఫ్యామిలీ నుంచి ఒకరిని ఇక్కడ పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి మానసికంగా సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.