Homeఆంధ్రప్రదేశ్‌Jagan Sensation: ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ సంచలనం

Jagan Sensation: ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ సంచలనం

Jagan Sensation: సమ్ థింగ్ రాంగ్.. జగన్ ఏదో చేయబోతున్నాడు. కానీ ఏదని తెలియడం లేదు. దాన్ని ప్లీనరీలోనే ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. జగన్ ప్రకటించే ఆ సంచలనం ఏంటన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు. అది ముందస్తు ఎన్నికలను అని.. అభ్యర్థులను ప్రకటించబోతున్నాడని తెలిసింది.

Jagan Sensation
CM Jagan

వచ్చే నెలలో జరగనున్న పార్టీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జూలై 8, 9 తేదీల్లో విజయవాడ-గుంటూరు మధ్య ప్లీనరీ జరగనుండగా అక్కడ జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు.

Also Read: World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా… ప్రత్యేక కథనం

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా లేదా అన్నది జగన్ ప్రకటించనప్పటికీ.. అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆ దిశగా పరోక్షంగా సంకేతాలు ఇవ్వనున్నారు.“వాస్తవానికి, అతను తదుపరి ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయడు, కానీ వారి పనితీరు తక్కువగా ఉన్నందున ఎవరికి టిక్కెట్లు రాలేవో ప్రకటిస్తాడు. అది అభ్యర్థుల జాబితాను పరోక్షంగా ప్రకటించడమేనని’’ అని పార్టీ వర్గాలు తెలిపాయి.

Jagan Sensation
Jagan

అభ్యర్థులకు టికెట్‌పై క్లారిటీ వస్తే ఇక నుంచి తమ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టిక్కెట్లు నిరాకరించే ఎమ్మెల్యేల స్టాండ్‌పై వైఎస్‌ఆర్‌సి అధిష్టానం కూడా క్లారిటీ రానుంది. వారు పార్టీ కోసం పని చేయగలిగితే, అది మంచిది. లేదంటే ప్రత్యామ్మాయం చూసుకున్నా ఫర్వాలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీని నాశనం చేస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు.

జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేక షెడ్యూల్ ప్రకారమే వెళ్తారా అనే విషయంపై ప్లీనరీ ఒక క్లూ అందజేస్తుంది. అలాగే పార్టీ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించి ఎన్నికల వరకు చురుగ్గా ఉండేలా చూస్తారు. ‘ఇటీవలి గడప గడపకూ ప్రభుత్వం, సామాజిక న్యాయ భేరి కార్యక్రమాలు జగన్‌కు తమ పార్టీ బలాలు, బలహీనతలు ఏమిటో, టీడీపీ ఏ మేరకు పుంజుకుంటుందో కొంత అవగాహన కల్పించాయి. ఇప్పుడు ఎన్నికలకు వెళితేనే గెలుస్తామని.. 2024 వరకూ వెళితే పవన్ కళ్యాణ్ బలపడి.. వ్యతిరేకత పోగుబడి మొదటికే మోసం వస్తుందని జగన్ గ్రహించినట్టు తెలిసింది. అందుకే ప్లీనరీ వేదికగా ముందస్తు ఎన్నికల ప్రకటనను జగన్ చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఎదగకుండా.. టీడీపీ బలపడకుండా చేసి ఎన్నికల్లో ఈజీగా గెలవవచ్చని జగన్ ప్లాన్ చేశారట.. మరి ఇది వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

Also Read: South Heros: రజినీ, ప్రభాస్ చెరో మూడు లేటెస్ట్ గా కమల్… ఎన్టీఆర్ తో పాటు 300 కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular