ఆంధ్రప్రదేశ్‌Jagan Sattenapalli Visit: జగన్ కు ఏపీ పోలీసుల షాక్

Jagan Sattenapalli Visit: జగన్ కు ఏపీ పోలీసుల షాక్

Jagan Sattenapalli Visit: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మైండ్ బ్లాక్ అయింది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా పోలీసుల అనుమతి కోరారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు షాక్ తగిలినట్లు అయింది.

అనుమతి నిరాకరణ..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో తలెత్తుతున్న శాంతిభద్రతల విఘాతం దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు( Kanchi Srinivasa Rao ) చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయితే విగ్రహ ఆవిష్కరణకు పరిమిత సంఖ్యలో మాత్రమే జనాలు రావాలని కూడా సూచించారు. లేకుంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పర్యటన సమయంలో ఒకేసారి జనాలు హెలిప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. ఇటీవల ఓ జిల్లా పర్యటనకు వెళ్తే విధ్వంసం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: YS Jagan Mohan Reddy : జగన్మోహన్ రెడ్డి అరెస్ట్.. ముహూర్తం ఫిక్స్!

పరిమిత సంఖ్యలో వస్తేనే.. సత్తెనపల్లి( sattenapalle ) మండలం రెంటపాళ్లలో విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. అందుకు సంబంధించి జగన్ పర్యటన కోసం సత్తెనపల్లి వైసీపీ ఇన్చార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ కార్యక్రమానికి ఎంత మంది వస్తున్నారు? ఎన్ని వాహనాలు వస్తున్నాయి? వారికి కావాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే పూర్తి వివరాలను సమర్పించకపోయేసరికి పల్నాడు జిల్లా ఎస్పీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల మందికి పైగా జనాలు వచ్చే అవకాశం ఉందని తెలియడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

Also Read: AP Liquor Scandal: ఏపీ మద్యం కుంభకోణం.. నోరు విప్పిన జగన్!

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే పోలీసులు అడిగిన పత్రాలు, వివరాలు అందిస్తే మాత్రం వారు పునః పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు పలనాడు జిల్లా ఎస్పీ మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని.. సెక్యూరిటీ కాన్వాయ్ తో పాటు మరో మూడు వాహనాలు, 100 మంది వరకు విగ్రహ ఆవిష్కరణకు వస్తే తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. వైసీపీ నేతల కోరిన విధంగా అనుమతి ఇవ్వలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే ఏపీ పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

Sakshi Media: వైసీపీని పక్కన పెట్టేసిన సాక్షి!

Sakshi Media: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి వరమా? శాపమా అన్నది అర్థం కావడం లేదు. సాక్షి మీడియా పార్టీ లైన్ కంటే.. జగన్మోహన్ రెడ్డి లైన్ కి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది....

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version