YS Jagan Mohan Reddy: నేను మంచోడిని.. నేను మంచోడిని.. నాకంటే మంచోడు ఎవడుంటాడు? ఇలా చెబుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాను మంచి వాడిని కాబట్టే మీరంతా హాయిగా ఉన్నారు అంటూ చెబుతున్నారు. ఆయన మంచితనం గురించి ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. ఆయన మంచితనాన్ని ఆ పార్టీ శ్రేణులు ఎలాను జీవితాంతం గుర్తుంచుకుంటాయి కానీ.. ఆయన మంచితనం రాజశేఖర్ రెడ్డి కి తెలుసు.. అందుకే ఆయనను పులివెందుల కాకుండా బెంగళూరు ప్యాలెస్ కు పరిమితం చేశారు. ఆయన మంచితనం తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలకు తెలుసు కాబట్టి వారు దూరంగా ఉన్నారు. ఆయన మంచితనం ఒకప్పటి రాజశేఖర్ రెడ్డి తెలుసు కాబట్టి వారంతా దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి మంచితనం గురించి చెప్పనవసరం లేదు.
* చంద్రబాబుకు గుండెపోటు రావాలని మంచితనంగా..
నిన్ననే వారాంతపు మీడియా సమావేశానికి గాను జగన్ హాజరయ్యారు. తన మంచితనం గురించి చెప్పుకోవడమే కాదు చంద్రబాబుకు గుండెపోటు రావాలని కోరుకున్నారు. అందులో కూడా ఆయన మంచితనం కనిపిస్తోంది. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రారంభ సమయంలో.. ముఖ్యమంత్రి రేసులో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిని బెంగళూరుకి వెళ్లిపోమన్నారట ఆయన మంచితనాన్ని చూసి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంచితనంతోనే అంతా సంపాదించేశారు. అందుకే ఆ మంచితనాన్ని గౌరవించి అక్రమ ఆస్తులు కేసులు పెట్టారు. 16 నెలల పాటు ఆయన మంచితనాన్ని గౌరవించి జైల్లో పెట్టారు. ఆయన మంచితనం ఎంతలా అంటే తన బాబాయిని హత్య చేసిన నిందితులను కాపాడుకునేటంత. తన గెలుపు కోసం శక్తియుక్తులను ఉపయోగించిన షర్మిలను పార్టీ నుంచి బయటకు పంపించేదాకా ఆయన మంచితనం పనిచేసింది. తనకోసం పరితపించిన తల్లిని తప్పు పట్టడమే ఆయన మంచితనం. సొంత బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్న గొప్ప మంచితనం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మంచితనం గురించి అయిన వారే ఎక్కువగా చెబుతుంటారు.
* వారంతా మంచితనం గుర్తించలే..
రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ వదిలి వైయస్సార్ అనే పేరును తీసుకుని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆయన మంచితనం చూసి దూరంగా ఉండిపోయారు రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. మంచితనం అంటే మనం గురించి మనం చెప్పుకోవడం కాదు. మన గురించి చుట్టూ ఉన్నవారు చెబితేనే మనం మంచి వారు అవుతాం. చెడ్డ పనులు చేసేవారు తాము మంచి వారం మంచి వారం అంటే… తమపై అభిమానం ఉన్నవారు నమ్ముతారే కానీ.. వాస్తవాలు తెలిసినవారు నమ్మరు గాక నమ్మరు. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి మంచితనం ఉన్న వ్యక్తి మాటలు మరి నమ్మరు. మంచితనం అనేది చెప్పుకుంటే రాదు. చెప్పకపోతే పోదు. ఎందుకంటే అది మంచితనం కాబట్టి..
