Jagan And Ambati Rambabu: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. పట్టు బిగించాలని కూటమి.. దాని పట్టు సడలించాలని వైయస్సార్ కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పాత్రధారులు, సూత్రధారులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం ద్వారా తమ రాజకీయ పరపతి పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంబటి రాంబాబును కాపు ఐకాన్ గా చూపిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఆయన విషయంలో కాపులకు భిన్న వైఖరి ఉంది. అప్పుడెప్పుడో 1989లో ఆయన గెలిచారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ వేవ్ లో నిలబడగలిగారు. అయితే ఆయన విపరీత వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అందుకే ఇప్పుడు ఆయనను రాత్రికి రాత్రే కాపు జాతి నాయకుడిగా మార్చాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
అయితే ఈ ఎపిసోడ్ లో ఒక్క విషయాన్ని గ్రహించాలి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి ఎంత మైలేజ్ వస్తుందో చెప్పలేం కానీ.. ఇప్పటివరకు సత్తెనపల్లి హీరో గా ఉన్న ఆయన రాత్రికి రాత్రి స్టేట్ నాయకుడిగా మారిపోయారు అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించడం.. అంబటి రాంబాబు టైగర్ అని చెప్పడం.. కాపు ఐకానిక్ అని రాష్ట్రవ్యాప్తంగా చాటింపు వేయడం మాత్రం అంబటి రాంబాబుకు ఊహించని వరాలే. కానీ రాష్ట్రంలో కాపులు మాత్రం అంబటి రాంబాబును కనీసం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. కానీ వైసిపి తమ నెత్తిన పెడుతుండడాన్ని కాపులు సహించుకోలేకపోతున్నారు. మొన్నటివరకు కాపు ఐకానిక్ అంటే ముద్రగడ పద్మనాభం ఇలానే చూపించారు. చివరకు ఆయన నాయుడు కాదు రెడ్డి అంటూ తనకు తానుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునేలా చేశారు. అయితే ఒక్కటి మాత్రం నిజం పౌరుషం కాపు నేతలది. రాజకీయ లబ్ది ఇంకొకరిది.
కాపులు( Kapu caste ) రాజ్యాధికారం కావాలని కోరుకున్నారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు కూడా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ అనేసరికి అదేదో హోదా కాదు. చంద్రబాబుతో సమానంగా ఆయనకు మంచి గౌరవం దక్కుతోంది. ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తున్నారు. అయితే ఎక్కడా కాపు లో ప్రయోజనాలకి అన్నట్టు కాదు. అందరి సంక్షేమం దృష్ట్యా ఆలోచన చేసేవారు పవన్. ఇప్పుడు ఆయనను తగ్గించేందుకు అంబటి రాంబాబు లాంటి నేతను కాపుల ఐకానిక్ గా జగన్మోహన్ రెడ్డి పోల్చడం ఎంత మాత్రం రుచించడం లేదు కాపులకు. అయితే అంబటి రాంబాబు తో పాటు పేర్ని నాని లాంటి వారితో కాపు రాజకీయం చేయడం ఏమిటనేది వైసీపీ శ్రేణుల్లోనే ఒక రకమైన చర్చ ఉంది. ఇది మరోసారి గాడిన తప్పే అవకాశం ఉంది.