Homeఆంధ్రప్రదేశ్‌Pulasa Fish: ఎర్ర నీళ్ల గోదావరిలో తొలి పులస వలకు చిక్కింది.. రికార్డులను బద్దలు కొట్టిన...

Pulasa Fish: ఎర్ర నీళ్ల గోదావరిలో తొలి పులస వలకు చిక్కింది.. రికార్డులను బద్దలు కొట్టిన ధర.. దక్కించుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరంటే..

Pulasa Fish: “పులస కోసం పుస్తెలు కూడా తాకట్టు పెడతారు” ఈ సామెత గోదావరేతర జిల్లాల వారికి కాస్త అతిశయోక్తి లాగా అనిపిస్తుంది. పులస కోసం మైళ్ళ దూరమైనా గోదావరి జిల్లాల వాసులు వెళ్తారు. పులస పులుసు కోసం ఎంతటి ఇబ్బందులైనా పడతారు. ఏడాదిలో.. ముఖ్యంగా వానలు కురిసే సమయంలో పులస ముక్కను తినాలని.. పులస పులుసును జుర్రు కోవాలని అనుకుంటారు. దానికోసం ఎంత ఖర్చయినా చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. మెండుగానే వర్షాలు కురుస్తున్నాయి. కొత్తనీటితో నదులన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాలు ఏమోగానీ.. గోదావరి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎర్ర నీరు వచ్చి చేరిందంటే పులస వలకు చిక్కినట్టే.. అయితే ఈసారి వర్షాలు కాస్త ఆలస్యం కావడంతో గోదావరి జిల్లాల మత్స్యకారులు డీలా పడిపోయారు. ఆలస్యమైనప్పటికీ.. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో.. మత్స్యకారుల వలలకు పులసలు చిక్కుతున్నాయి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక గోదావరిలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది. గోదావరి జిల్లాల్లో ఆషాడం అల్లుళ్లకు, బంధువులకు పులస చేపలతో విందు ఇవ్వడం ఒక ఆనవాయితీ.

గత 15 రోజులుగా గోదావరి ఎగవ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీరు పూర్తిగా రంగు మారింది. ఎప్పుడైతే నీరు రంగు మారిందో ఎప్పుడైతే నీరు రంగు మారిందో మత్స్యకారులు వలలతో వేటకు వెళ్ళిపోయారు. గోదావరి మత్స్యకారుల కష్టాన్ని చూసి చలించిపోయినట్టుంది.. అందుకే వారికి ఆనందాన్ని ఇవ్వాలని పులసను వారి వలలకు చిక్కేలా చేసింది. దీంతో ఆ మత్స్యకారుల ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. అప్పన రాముని లంక గోదావరిలో ఓ మత్స్యకారుడి వాళ్లకు పులస చిక్కింది. ఈ చేప భారీ ధర పలికింది. ఆ అనుకున్నట్టుగానే రికార్డ్ స్థాయిలో ఆ మత్స్యకారుడికి లాభం దక్కింది. కేజీన్నర బరువు ఉన్న పులస చేపను అప్పన రాముని లంక మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 కొనుగోలు చేశారు.. పోటాపోటీ మధ్య ఆయన ఆ ధరకు దక్కించుకున్నారు. చేపను సొంతం చేసుకున్న అనంతరం శ్రీను ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో ఫోన్లో చెప్పారు. బంధువులతో కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చేప అమోఘమైన రుచిని కలిగి ఉంటుంది. ఏడాదిలో ముఖ్యంగా కొత్తనీరు వచ్చే సమయంలో ఎక్కువగా లభిస్తుంది.

కొత్తనీరు చేరడం వల్ల ఈ చేపలు గోదావరికి ఎదురెక్కుతాయి. కొత్త నీటిని తాగడం వల్ల వీటి శరీరం రంగు మారుతుంది. అంతేకాదు ప్రత్యేకమైన ఖనిజలవణాలను శోషించుకోవడం వల్ల ఆ చేప ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంటుంది. దానిని తినడం వల్ల శరీరానికి మెండుగా పోషకాలు లభ్యమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చింతపండు, కాస్త పచ్చి మామిడికాయలను జత చేసి పులుసు పెడితే.. అమోఘమైన రుచి లభిస్తుంది. అందుకోసమే గోదావరి జిల్లా వాళ్లు పులస చేప అంటే ఎగబడతారు. పూర్వపు రోజుల్లో తమకు ఏవైనా కార్యాలయంలో పనులు కావాలంటే సంబంధిత అధికారులకు పులస చేపలను పంపించేవారు. ఇంకొందరైతే పులస చేపలను పచ్చడి పెట్టించి ఇచ్చేవారట. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ వలలకు పులస చేపలు మరిన్ని చిక్కుతాయి అంటూ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper