EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల జీతంలో నుంచి కొంత మొత్తం సేవ్ అయి.. రిటైర్మెంట్ అయిన తరువాత ఈ మొత్తాన్ని వడ్డీ రూపంలో తిరిగి ఉద్యోగులకు అందిస్తారు. అయితే రిటైర్మెంట్ కు ముందే అత్యవసరం ఏర్పడితే ఇందులో నుంచి 80 శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కొందరు క్లెయిమ్ చేసుకుంటే చాలా సమయం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు క్లెయిమ్ చేసుకున్న 20 రోజుల్లోపే డబ్బులు తమ ఖాతాల్లో జమ కావాలని కొత్త రూల్ తెచ్చారు. దీంతో ఈ రూల్ ఉద్యోగులకు ప్రయోజనం ఏర్పడనుంది. ఇంతకీ ఈ రూల్ ఎలా ఉందంటే?
EPFO డబ్బులు విత్ డ్రా చేసుకునేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. గతంలో ఇందులో ఉన్న డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఆలస్యం అయేది. కానీ ఇప్పుడు కొత్తగా EPF Scheme లోని Para 72 (7) ప్రకారం ఖాతాదారులు క్లెయిమ్ చేసుకున్న తరువాత 20 రోజుల్లోనై సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాని పక్షంలో 12 శాతం వడ్డీతో ఫెనాల్టీని చెల్లిస్తారు. గడువులోగా క్లెయిమ్ పరిష్కారం కాకపోతే ఖాతాదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ పిర్యాదును పరిశీలించి నిజమని తేలితే వడ్డీ చెల్లిస్తారు.
అయితే ఇక్కడ ఖాతాదారులు తమ క్లెయిమ్ చేసుకొని 20 రోజుల్లోపు చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా క్లెయిమ్ లో ఏదైనా లోపం ఉండి.. లేదా ఈ కేవైసీ సమస్య, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే మాత్రం ఈ ఫెనాల్టీ వర్తించదు. అన్నీ సక్రమంగా ఉండి డబ్బులు జమ కాకపోతే మాత్రం ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనిని ఈపీఎఫ్ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి.
ఖాతాదారులు క్లెయిమ్ చేసుకొని 20 రోజుల గడువు దాటినా కూడా తమ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కాకపోతే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా EPFIGMSద్వారా కంప్లెయింట్ ఇవ్వాలి. ఈ పోర్టల్ లో పీఎఫ్ సభ్యులు, ఈపీఎస్ పెన్షనర్లు, యజమానులు తమ సమస్యలను తెలపవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దీని ఆధారంగా స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఫిర్యాదు చేసేటప్పుడు UAN, PFనెంబర్ సరైన విధంగా నమోదు చేయాలి. అలాగే ఫిర్యాదు చేసిన తరువాత వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ భద్రపరుచుకోవాలి.

