Chandrababu Naidu narrow escape: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వయసు ఇప్పుడు ప్రస్తుతం ఏడుపదులు దాటిపోయింది. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ ఉత్సాహంగానే ఉన్నారు. పరిపాలనలో దూకుడు కొండ సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తున్నారు. ప్రతినెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ రాష్ట్రంలో ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుంటున్నారు. లబ్ధిదారుల దగ్గరికి నేరుగా వెళ్తున్నారు. వారితో మాట్లాడి పింఛన్ అందజేస్తున్నారు.
ఐటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు గతంలో సీఈఓ మాదిరిగా ఉండేవారు. ఐటీ ని డెవలప్ చేసే క్రమంలో.. ప్రజలతో అప్పుడప్పుడు మాత్రమే మమేకం అవుతూ ఉండేవారు. అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను నిత్యం తెలుసుకుంటూనే.. వాటికి పరిష్కార మార్గం చూపించేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. కేవలం ఐటీ మాత్రమే కాకుండా.. స్పేస్ విభాగాలలో కూడా ఏపీ రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టే విధంగా విధానాలు రూపొందిస్తున్నారు. అక్కడితోనే చంద్రబాబు ఆగిపోవడం లేదు.. మౌలిక సదుపాయాలు.. వ్యవసాయం.. ఇతర అనుబంధ రంగాల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు.
గతంలో అధికారులతో ఆయన గంటల తరబడి సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా ఆయన క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కార మార్గాన్ని అక్కడికక్కడే వెతుకుతున్నారు. అధికారులను నిందించడం లేదు. ప్రజలను దూరం పెట్టడం లేదు. మొత్తంగా నాయుడు మారిపోయాడు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రజలతో కలిసి టీ తాగుతున్నారు. వారింట్లో చేపల కూరతో వండిన భోజనం తింటున్నారు.. ఇంకా చెప్పాలంటే కల్లు కూడా రుచి చూస్తున్నారు.
చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఇటీవల ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విశాఖపట్నం లో నెట్ జీరో కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ మీద ప్రయాణించారు. దాదాపు నోవాటెల్ హోటల్ ప్రాంగణం వరకు చేరుకునే సమయంలో చంద్రబాబు తొక్కుతున్న సైకిల్ కాస్త అదుపుతప్పింది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ ఆయన సైకిల్ పట్టుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన సైకిల్ కంట్రోల్ చేసుకోగలిగారు. ఏం పర్వాలేదు అమ్మ.. సైకిల్ వదిలిపెట్టండి.. నేను చూసుకుంటాను.. ఇబ్బంది లేదని సెక్యూరిటీ సిబ్బందితో చంద్రబాబు అన్నారు.
ఈ వయసులో కూడా చంద్రబాబు సైకిల్ తొక్కడం ఒక రికార్డ్ అయితే.. సైకిల్ అదుపుతపుతున్నప్పటికీ కూడా ఆయన తనను తాను కంట్రోల్ చేసుకున్న విధానం గొప్పగా ఉందని టిడిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఆయన కంటే వయసులో చిన్న వాళ్లయిన నాయకులు చంద్రబాబు వెనుక ఉండిపోతే.. చంద్రబాబు మాత్రం నవ యువకుడిలా సైకిల్ తొక్కడం మొదలుపెట్టారు. చంద్రబాబు పరిమిత స్థాయిలో డైట్ తీసుకుంటారు. ఆయన మద్యం ముట్టరు. చక్కెర పదార్థాలను దగ్గరికి రానివ్వరు. ఆయిల్ ఫుడ్ తీసుకోరు. కేవలం మిల్లెట్స్.. మితంగా మాంసాహారం తింటారు. అందువల్లే చంద్రబాబు ఈ వయసులో కూడా ఇంత హెల్తీగా ఉన్నారు.
చంద్రబాబుకి తప్పిన ప్రమాదం
విశాఖలో నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ మీద ప్రయాణిస్తుండగా తప్పిన ప్రమాదం pic.twitter.com/LkaxZfoFe6
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
