spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని వదిలే ప్రసక్తే లేదా? రంగంలోకి దిగిన సిఐడి!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని వదిలే ప్రసక్తే లేదా? రంగంలోకి దిగిన సిఐడి!

Vallabhaneni Vamsi: వైసీపీ ఫైర్ బ్రాండ్లలో వల్లభనేని వంశీ ఒకరు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. అదే పార్టీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిండు శాసనసభలో ఆయనను అవమానించారు కూడా. ఏకంగా చంద్రబాబు సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దారుణంగా అవమానించారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫారసులతో 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు వల్లభనేని వంశీ. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గన్నవరం నుంచి విజయం సాధించారు. అయితే 2014 నుంచి 2019 వరకు తన విధేయతను ప్రదర్శించుకుంటూ వచ్చారు. తన స్నేహితుడు కొడాలి నాని ఒత్తిడి చేసినా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో సైతం టిడిపి అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచారు. అయితే రాష్ట్రంలో వైసిపి అధికారం లోకి రావడంతో ఆయన స్వరం మారింది. కొద్ది రోజులకే టిడిపిని విభేదించి వైసిపి పంచన చేరారు. అది మొదలు చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. జగన్ వ్యూహాత్మకంగా వల్లభనేని వంశీని చంద్రబాబుపై ప్రయోగించారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు కుటుంబం పై కూడా వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పై నిత్యంషాకింగ్ కామెంట్స్ చేసేవారు. అయితే ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వల్లభనేని వంశీ విదేశాలకు పారిపోయారని ప్రచారం సాగింది. అయితే ఆయన మాత్రం ఇక్కడే ఉంటూ కనిపించడం ప్రారంభించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తాజాగా గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడి కేసును తెరపైకి తెచ్చింది. ఏకంగా ఆ కేసును సిఐడి కి అప్పగించింది.

* యార్లగడ్డ వెంకట్రావు తో చెక్
గన్నవరం నుంచి పోటీ చేసి తనపై గెలవాలని చంద్రబాబుతో పాటు లోకేష్ కు పలుమార్లు సవాల్ చేశారు వల్లభనేని వంశీ. అయితే అనూహ్యంగా చంద్రబాబుకు సరైన అభ్యర్థి దొరికారు. అప్పటివరకు వైసీపీలో కొనసాగిన యార్లగడ్డ వెంకట్రావును టిడిపిలోకి రప్పించారు. ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వల్లభనేని వంశీని దారుణంగా దెబ్బ కొట్టారు. 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వల్లభనేని వంశీ భావించారు. కానీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరించారు. అయితే నాడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ పై రివెంజ్ కు ఇప్పుడు సరైన ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం. ఏకంగా ఆయన కేసును సిఐడి కి అప్పగించింది. దీంతో వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చుబిగించడం ఖాయంగా తేలింది.

* రకరకాలుగా ప్రచారం
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ జాడ లేకుండా పోయింది.ఆయన విదేశాలకు పారిపోయారని ప్రచారం జరిగింది. ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఇదే తరహా టాక్ నడిచింది. ఓటమిని ముందే గమనించిన వల్లభనేని వంశీ అమెరికా పారిపోయారని.. ఇక రారా అని కూడా తెగ ప్రచారం నడిచింది. అయితే సరిగ్గా కౌంటింగ్ మొదలవుతుందనగా వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. ఓటమి తర్వాత ఎవరికి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే నాడు టిడిపి కార్యాలయం పై దాడి కేసు బయటకు వచ్చింది. ఆయన కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ ను జల్లెడ పట్టారని కూడా అప్పట్లో ఒక రకమైన ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ కేసును ఏకంగా సిఐడి కి అప్పగించడం.. వల్లభనేని వంశీ కోసమేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నోటి దూలకు.. ఇప్పుడు వంశీ మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందన్న టాక్ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper