ఆంధ్రప్రదేశ్‌AP SSC Results 2025: ఒకరికి 600కు 600.. ఇంకొకరికి ఒక్క మార్కు.. ఏపీ 10వ...

AP SSC Results 2025: ఒకరికి 600కు 600.. ఇంకొకరికి ఒక్క మార్కు.. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో రికార్డులు!

AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) పదో తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో అనేక రికార్డులు నమోదు అయ్యాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 600 మార్కులు పొందింది ఓ విద్యార్థి. అదే సమయంలో ఓ జిల్లాకు చెందిన విద్యార్థి ఒకే ఒక్క మార్కుతో రికార్డ్ సృష్టించాడు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన సదరు విద్యార్థి ఒక సబ్జెక్టులో మాత్రం ఒక్క మార్కు తెచ్చుకున్నాడు. పదోతరగతి ఫలితాలను ఈరోజు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. అయితే బాలురు కంటే బాలికలు అధిక శాతం లో ఉత్తీర్ణత సాధించారు.

Also Read: అటు వైసిపి.. ఇటు టిడిపి.. ఏకకాలంలో విజయసాయిరెడ్డి టార్గెట్!

* సరికొత్త రికార్డు
తూర్పుగోదావరి జిల్లా( East Godavari district) కాకినాడకు చెందిన నేహాంజని( Neha Anjani ) అనే బాలిక 600కు 600 మార్కులు సాధించింది. స్థానిక భాష్యం పాఠశాలలో చదువుతున్న నేహాంజని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఆ విద్యార్థినిపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి లోని ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అదేవిధంగా పలనాడు జిల్లా జడ్పిచర్ల జడ్పీ హైస్కూల్ కు చెందిన పావని చంద్రికకు 598 మార్కులు వచ్చాయి. దీంతో ఆమెను హెచ్ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

* సత్తా చాటిన బాలికలు..
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో( 10th class results ) బాలికలు సత్తా చాటారు. మొత్తం ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదయింది. వీరిలో బాలురు 78.31%, బాలికలు 84.09% ఉత్తీర్ణులయ్యారు. 1680 పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత నమోదయింది. 19 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదు అయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90% ఉత్తీర్ణత నమోదయింది. మే 19 నుంచి 28 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

* ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత..
మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి ( academic year ) ఇదే చివరి పని దినం. ఇదే రోజు పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ప్రతి పాఠశాలల్లో సందడి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం గతంకంటే పెరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక మార్కులు పొందారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరానికి భర్తీ కానున్నారు. మొత్తానికైతే పాఠశాల విద్యాశాఖకు ఇది శుభ పరిణామం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

AP 10th Results: ఆ విద్యార్థిని కుటుంబానికి ఎకరం పొలం.. కలెక్టర్ ఆదేశాలు!

AP 10th Results ఈసారి 10 ఫలితాల్లో చిత్రవిచిత్రాలు వెలుగుచూసాయి. అయితే ఎక్కువమంది విద్యార్థులు ఫస్ట్ డివిజన్లో( first division) ఉత్తీర్ణత సాధించడం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదయింది.

AP SSC Results 2025: ఒకేసారి తండ్రీకూతురు పదో తరగతి ఉత్తీర్ణత.. కవలలకు సమాన మార్కులు!

AP SSC Results 2025 సాధారణంగా 600కు 600 మార్కులు రావడం ఇదివరకు ఎన్నడూ చూడలేదు. కాకినాడకు( Kakinada) చెందిన నేహాంజని( Neha Anjani) ఈ ఘనత సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధము రాలిగా నిలిచింది.

Most Popular

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Tammineni Family

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...