Telugu States Economic Progress: రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం అవుతోంది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన అధికారికంగా జరిగింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని ఎవరు ఊహించలేదు. విడిపోతే రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయి అన్న భావన ఎక్కువగా ఉండేది. కానీ 12 సంవత్సరాల తరువాత వెనక్కి తీసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి. ఉమ్మడి రాష్ట్రపరంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెనుకబాటు కనిపించినా.. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. ఇక రాజకీయంగా సైతం తనదైన మార్కు చాటుకున్నాయి రెండు రాష్ట్రాలు. రెండు రాష్ట్రాల ప్రజలు రాజకీయంగా భిన్న వైఖరి ప్రదర్శించారు. అయినా సరే తన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు.
* రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ కు ఛాన్స్ ఇచ్చారు. రాజధాని లేని ఏపీని చంద్రబాబు అయితేనే అభివృద్ధి చేయగలరని ప్రజలు ఆశించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కెసిఆర్ ను గుర్తించి.. అదే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలరని భావించి అవకాశం కల్పించారు. అయితే ఏపీలో ఐదేళ్లకే అధికార మార్పిడి చేశారు. తెలంగాణలో మాత్రం కెసిఆర్ కు తొమ్మిదేళ్లపాటు అవకాశం కల్పించారు. మూడోసారి ఛాన్స్ ఇవ్వకపోగా.. ఏపీలో చంద్రబాబుకు మాత్రం రెండో ఛాన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేశారు.
* తెలంగాణకు విద్యుత్ సమస్యలు, ఆంధ్రకు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని ఎక్కువ మంది అంచనా వేశారు. కానీ ఆ సమస్యలన్నింటినీ రెండు రాష్ట్రాలు అధిగమించాయి అని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రపరంగా వెనుకబాటు ఉన్నా.. విభజిత రాష్ట్రాలుగా మిగతా దక్షిణాది రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చాయి.
* ఏపీలో మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. తెలంగాణలో రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గుర్తించి ఛాన్స్ కల్పించారు. ఇలా రాజకీయంగా కూడా బ్యాలెన్స్ చేశారు ఉభయ రాష్ట్రాల ప్రజలు.
* రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పుష్కర కాలంలోనే అంతరం పోయింది. మళ్లీ పాత రోజులు మాదిరిగానే సోదర భావం పెరిగింది. పారిశ్రామికంగా తెలంగాణ అభివృద్ధి సాధించగా.. ఏపీ కూడా నవనిర్మాణ దిశ గా అడుగులు వేసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
* ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని రకాల విభజన సమస్యలు ఉండిపోయాయి. చంద్రబాబు, కెసిఆర్ సమయంలో జరగలేదు. కెసిఆర్ కు మిత్రుడైన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోక్షం కలగలేదు. కానీ ఇటు చంద్రబాబు, అటు రేవంత్ వచ్చిన తర్వాత మాత్రం పురోగతి పెరిగింది.
* రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజలు బాధపడ్డారు మొదట్లో. కానీ పుష్కరకాలం తర్వాత మాత్రం మంచిదే అన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రారంభంలో సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఉమ్మడిగా ఉంటేనే కొంత కలిసి వచ్చేదేమో అనే రీతిలో ఆలోచన చేస్తున్నారు.
* ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ అనేది అక్కడి ప్రజల్లో తగ్గింది. ఆ సెంటిమెంట్తో రాజకీయాలు చేసిన పార్టీల హవా కూడా తగ్గింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రజల ఆకాంక్ష కూడా అదే.
