pawan kalyan: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా అదిరిపోయే సెట్స్ వేయబోతున్నారని. ఢిల్లీలోని చాందినీ చౌక్ ను రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
భారీగా ఉండే చాందినీ చౌక్ సెట్ ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. అన్నట్టు ఈ సెట్ లోనే పవన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇచ్చాడు. మొత్తమ్మీద పవన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ డేట్లు అన్ని సినిమాలకు తలా నాలుగు రోజులు ఇస్తూ వస్తున్నాడు.
Also Read: BJP in Telanagana: సర్వే: టీఆర్ఎస్, కాంగ్రెస్ ఖేల్ ఖతం.. తెలంగాణ బీజేపీదే?
మొదటిసారి.. ‘హరిహర వీరమల్లు’ సినిమాకి మాత్రం వరుసగా 25 రోజులు డేట్స్ ఇచ్చాడు. నిజానికి మొదటి నుంచీ ఈ సినిమా బాగా లేట్ అవుతుంది. అసలుకే మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. అలాగే నటీనటుల మేకప్ కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే లేట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఇలా బల్క్ డేట్స్ ఇవ్వడం మంచి పరిణామం.
Also Read:T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ -2022 షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?