HomeతెలంగాణGold Found In Farmland: ఆ భూమిలో బంగారం దొరికింది.. ఎవరు హక్కుదారులు..ఇప్పుడిదే పెద్ద పంచాయితీ..

Gold Found In Farmland: ఆ భూమిలో బంగారం దొరికింది.. ఎవరు హక్కుదారులు..ఇప్పుడిదే పెద్ద పంచాయితీ..

Gold Found In Farmland: మనదేశంలో భూములు కొనుగోలు చేసిన వారికే చెందుతాయి. అమ్మిన వాళ్లకు డబ్బులు లభిస్తాయి.. భూములు ఎవరు కొనుగోలు చేసినా.. ఎవరు విక్రయించినా.. శాశ్వత హక్కుదారు మాత్రం ప్రభుత్వమే. అందువల్ల భూమిలో లభించే ప్రతి విలువైన ఖనిజాలు ఇతర వస్తువులు ఏదైనా సరే ప్రభుత్వానికే దక్కాలి. ఒకవేళ భూ యాజమానులు ముందుగా దొరికిన వస్తువులకు సంబంధించి సమాచారాన్ని పోలీసులకు చెబితే అప్పుడు వారికి కొంత వాటా లభిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. జరిగిన స్టోరీ అటువంటిది కాబట్టి..

ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఓ ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.. ఈ భూమి రోడ్డు పక్కనే ఉంటుంది. పైగా మెట్ట భూమి. ఇందులో గత నెలలో కూలీలు పనిచేస్తుండగా బంగారం లభించింది. ఆ బంగారం భారీ ఎత్తున ఉందని తెలుస్తోంది. కూలీలకు బంగారం దొరికిన విషయం భూ యజమానికి తెలిసింది. దీంతో ఆయన కూలీలను నిలదీస్తే అసలు విషయం చెప్పారు. దీంతో వారంతా వాటాలు వేసుకున్నారు.

ఇక్కడితోనే ఈ విషయం ఆగిపోతే బాగుండేది. కానీ బంగారం దొరికిన విషయం.. వాటాలు వేసుకున్న విషయం గతంలో ఈ భూమి అమ్మిన వ్యక్తికి తెలిసింది. దీంతో ఆయన నేరుగా పోలీసులను సంప్రదించారు. “నేను గతంలో భూమి విక్రయించాను. ఆ భూమిలో ఇప్పుడు బంగారం లభించింది. ఆ బంగారం లో నాక్కూడా వాటా ఇవ్వాలి అంటూ” పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాలను మొత్తం బయటపెట్టారు. లోతుగా విచారణ సాగించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.

వాస్తవానికి ఆ భూములలో లభించిన బంగారం పాత యజమానికి చెందదు. అసలు అతడికి ఆ భూమి మీద ఎటువంటి హక్కులు ఉండవు. కొత్త యజమానికి కూడా ఆ బంగారం మీద అధికారం ఉండదు. ఈ భూమికి శాశ్వత యజమాని ప్రభుత్వమే కాబట్టి.. ప్రభుత్వం మాత్రమే స్వాధీనం చేసుకుంటుంది. పైగా ఈ ప్రాంతంలో గతంలో ఒక పురాతన ఆలయం ఉండేదని.. ఒక సందర్భంలో పురాతన వస్తువులు కూడా లభించాయని ప్రచారంలో ఉంది.

ఇప్పుడు లభించిన బంగారం వెనుక వందల, వేల సంవత్సరాల చరిత్ర గనుక ఉంటే కచ్చితంగా పురావస్తు శాఖ రంగంలోకి దిగుతుంది. అప్పుడు ఎవరు ఎంత మొత్తుకున్నా సరే బంగారంలో వాటా ఇవ్వరు. విషయం బయటపడింది కాబట్టి పోలీసులు కూడా దీన్ని సెటిల్ చేసే అవకాశం లేదు. కాబట్టి దొరికిన బంగారం ప్రభుత్వానికి వెళ్తుంది. గతంలో భూమి అమ్మిన యజమాని.. ఇప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తి జస్ట్ నిశ్శబ్దంగా ఉండటమే మంచిది. లేకుంటే కేసులు పెట్టి లోపల వేసే ప్రమాదం ఉంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular