spot_img
Homeఅంతర్జాతీయంUkraine missing people crisis: ఉక్రెయిన్ లో మనుషులు మాయం.. అన్ని వేళ్లూ రష్యా వైపే.....

Ukraine missing people crisis: ఉక్రెయిన్ లో మనుషులు మాయం.. అన్ని వేళ్లూ రష్యా వైపే.. ఇంతకీ ఏం జరుగుతోంది..

Ukraine missing people crisis: యుద్ధం వల్ల వచ్చే ప్రగతి ఉండదు. యుద్ధంతో కేవలం వినాశనం మాత్రమే జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు రెండు యుద్ధాలు భీకరంగా సాగాయి. అన్ని సందర్భాలలో కూడా నష్టం విపరీతంగా జరిగింది.. ఆస్తిపరంగా, మనుషుల ప్రాణాలపరంగా పూడ్చలేని నష్టం చోటుచేసుకుంది. ప్రపంచ యుద్ధంలో భాగంగా అమెరికా జపాన్ మీద బాంబు వేసినప్పుడు.. విపరీతమైన నష్టం చోటుచేసుకుంది. ఇప్పటికీ అక్కడ పచ్చ గడ్డి కూడా మొలవడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆధునిక కాలంలోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. అత్యంత శక్తివంతమైన మిస్సయిల్స్.. ఇతర మందు గుండు సామగ్రితో యుద్ధాలు సాగిస్తున్నారు. ఈ యుద్ధాలలో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో ఆస్తి నష్టం కూడా విపరీతంగా ఉంటున్నది. అందువల్లే యుద్ధాలు ఆపాలని.. ప్రపంచ శాంతిని వర్ధిల్లేలా చేయాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ యుద్ధ పిపాస ఉన్న అధ్యక్షులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా యుద్ధాలకు మరింత దారుణంగా పిలుపునిస్తున్నారు. అటువంటి అధ్యక్షుల వల్ల ప్రపంచంలో ఏదో ఒకచోట యుద్ధాలు సాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల అధ్యక్షుల పిలుపుల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి.

యుద్ధాలకు పిలుపునిచ్చే దేశ అధ్యక్షులు బాగానే ఉంటున్నారు. కానీ ముందు వరసలో పనిచేసే సైనికులే నరకం చూస్తున్నారు. చివరికి వారే సమిధలుగా మారిపోతున్నారు. యుద్దాల వల్ల సైనికుల పరిస్థితి దారుణంగా ఉంటుందో ప్రపంచానికి ఇప్పటికే అనేక సందర్భాలలో అర్థమైంది. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొంతకాలంగా యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ దేశంలో పోరాడుతున్న రష్యా సైనికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి తట్టుకోలేక నర మాంస భక్షణకు కూడా దిగినట్టు తెలుస్తోంది. దీ సండే టైమ్స్ అనే పత్రిక ఈ కథనాన్ని వెల్లడించింది. దాదాపు 5 సందర్భాలలో రష్యా సైనికులు తమ తోటి వారి మాంసాన్ని తిన్నారని ఉక్రెయిన్ నిగా వర్గాల సమాచారంతో తెలిసింది. 2025లో నవంబర్ నెలలో డోనెట్స్ ప్రాంతంలో ఒక సైనికుడు మరో ఇద్దరు సైనికులను చంపాడు. ఆ సైనికులను అతడు తినడానికి ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ దళాలు చంపేశాయి.. ఈ కథనాన్ని ది సండే టైమ్స్ వెల్లడించింది. దీంతో యుద్ధం వల్ల జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో.. అవి ఎంతటి దారుణానికి దారి తీస్తాయో ప్రపంచానికి తెలిసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version