spot_img
Homeఅంతర్జాతీయంBritain refugee crisis: బ్రిటన్‌ కొంప ముంచుతున్న శరణార్థులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..!

Britain refugee crisis: బ్రిటన్‌ కొంప ముంచుతున్న శరణార్థులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..!

Britain refugee crisis: బ్రిటన్‌.. ఒకప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. అనేక దేశాలను దశాబ్దాలు పాలించింది. బతుకుదెరువుకు వెళ్లి.. అక్కడే పాలకులుగా మారింది. భారత్‌కు కూడా వచ్చిన బ్రటిషర్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించారు. అయితే మారుతున్న పరిణామాలతో ఇప్పుడు బ్రిటన్‌ వలసలతో బాధపడుతోంది. శరణార్ధులుగా వచ్చిన వారు అక్కడే స్థిరపడి బ్రిటిషర్లు స్థానికత కోల్పోయేలా చేస్తున్నారు. అడవులు, సముద్రాలు, నదీ మార్గాల ద్వారా బ్రిటన్‌లో అడుగుపెడుతున్న శరణార్థులను అక్కడి పోలీసులు పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారు స్థిరపడేందుకు సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో అక్కడి జనాభాకన్నా శరణార్థులే ఎక్కువగా పెరిగిపోతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, సిరియా వంటి దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి.

స్థానికులపై దాడులు..
ఈ శరణార్థులు స్థానిక మహిళలు, యువతలపై దాడులు, లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు పెరిగాయి. కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం ఈ సమస్యలను విస్మరించి, ఫిర్యాదు చేసిన బ్రిటిష్‌ పౌరులపైనే విదేశీయులను అవమానిస్తున్నారని రేసిజం కేసులు పెడుతోంది. ఇది స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.

11 నగరాలపై వలసదారుల పట్టు.
బ్రిటన్‌లోని 11 నగరాల్లో వలసదారులు విపరీతంగా పెరిగాయి. అక్కడ స్థానికులే మైనారిటీలుగా మారారు. దీంతో మెజారిటీగా ఉన్న శరణార్థులు మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ 11 నగరాల్లోనే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంతో అక్కడి జనాభా పెరిగి స్థానిక పాలకులుగా కూడా వలసవాదులే ఎన్నికవుతున్నారు. ఈ నగరాల్లో ముస్లిం మేయర్లు, నాయకులు శరణార్థులను సమర్థిస్తూ చేరదీస్తున్నారు.

హోటళ్ల వద్ద నిరసన..
ప్రభుత్వం, వలసదారులు కలిసి స్థానికులకే సమస్యగా మారడంతో 11 నగరాల్లో ప్రజలు రోడ్డెక్కారు. పాలకుల తీరుకు, శరణార్ధుల దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరణార్థులను దేశం నుంచి పంపించాలని డిమాండ్‌ చేశారు. అయితే కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం ఆందోళన కారులను అరెస్టు చేసి నిరసనను అణచివేసింది.

ఈ సంఘటనలు బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ విధానాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. శరణార్థుల పునరావాసం నేరాలు పెరగడానికి కారణమవుతోంది. సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం ఫిర్యాదులను అణచివేయడం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచుతూ, దేశవ్యాప్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. భవిష్యత్తులో కఠిన చట్టాలు, సమతుల్య విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version