Homeఅంతర్జాతీయంG7 Summit France: మొన్నటిదాకా నోరేసుకుని అరిచాడు.. మోడీ విషయంలో ట్రంప్ ఎందుకు తగ్గాడు..

G7 Summit France: మొన్నటిదాకా నోరేసుకుని అరిచాడు.. మోడీ విషయంలో ట్రంప్ ఎందుకు తగ్గాడు..

G7 Summit France: ఫ్రాన్స్ దేశంలో జరిగిన జి 7 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చాలాసేపు మాట్లాడారు. వాస్తవానికి పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. ఈ భేటీ కంటే ముందు ప్రపంచ దేశాల అధినేతలతో నరేంద్ర మోడీ ఆప్యాయంగా కనిపించారు. వారందరినీ ఆలింగనం చేసుకొని ప్రేమను వ్యక్తం చేశారు. ట్రంప్ విషయానికి వచ్చేసరికి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.. పెద్దగా కుశల ప్రశ్నలు కూడా వేయలేదు.

ట్రంప్ కు అర్థమైంది

ఇటీవల కాలంలో అమెరికా భారత్ మీద వ్యవహరిస్తున్న తీరు
.. ముగ్గురు భారత నావికులు చనిపోవడం.. అర్థం లేని షరతులు.. పాకిస్తాన్ దేశానికి అండగా ఉండడం.. ఇవన్నీ కూడా భారత్ లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. వీటిని పరోక్షంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ మీద చూపించారు. దీంతో ట్రంప్ కు సినిమా అర్థమైంది. దీంతో మోడీతో ఆయన భేటీ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. త్వరలో ఇండియాకు వస్తానని ప్రకటించారు. అంతేకాదు ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

యుద్ధం వల్ల అమెరికాలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బలమైన ఓటర్లుగా భారతీయులు ఉన్నారు. వారందరి మనసులో స్థానం సంపాదించాలి అంటే కచ్చితంగా ట్రంప్ ఇండియాకు దగ్గర కావాలి. దీనికి తోడు వాణిజ్యపరంగా ఇండియా అమెరికాకు చాలా అవసరం. అందువల్లే ట్రంప్ పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పారు. అవసరాల మేరకే పాకిస్తాన్తో స్నేహం సాగించిన అమెరికా ఆ తర్వాత.. తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఇదేమి తెలియని పాకిస్తాన్ అమెరికాతో ఇంతకాలం అంట కాగింది. ఇరాన్ తో యుద్ధం ముగించడం వల్ల అమెరికాలో ధరలు దిగి వస్తాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఎంతో ఉపశమనం. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ట్రేడ్ డీల్ వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం మరో స్థాయికి వెళ్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో కొంతకాలంగా స్తబ్దమైన వాతావరణం నెలకొంది. అలాంటప్పుడు ట్రంప్ ద్వారాలు తెరిచిన నేపథ్యంలో.. రెండు దేశాలకు అనుకూలంగా వాణిజ విధానాలు రూపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ట్రేడ్ డీల్ పూర్తయితే.. కొన్ని అంశాలపై క్లారిటీ వస్తుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. తద్వారా తయారీ రంగాలు ఊపొందుకొనే అవకాశం ఉంటుందని.. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు.. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular