Homeఅంతర్జాతీయంShivaji statue in Israel: ఇజ్రాయిల్ లో శివాజీ విగ్రహం..దీని వెనుక రోమాలు నిక్కబొడిచే వెయ్యేళ్ల...

Shivaji statue in Israel: ఇజ్రాయిల్ లో శివాజీ విగ్రహం..దీని వెనుక రోమాలు నిక్కబొడిచే వెయ్యేళ్ల చరిత్ర..

Shivaji statue in Israel: మనదేశంలో శివాజీ మహారాజు జయంతి ఉత్సవాల నిర్వహిస్తుంటే కొంతమంది ఉదారవాదులకు కడుపు మండుతుంది. శివాజీ మహారాజ్ ను కీర్తిస్తుంటే వారికి కడుపులో దేవి నట్టు ఉంటుంది. ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశపు తిండి తింటూ.. ఈ దేశం కల్పించిన సౌకర్యాలు అనుభవిస్తూ.. ఈ దేశ ఉన్నతికి పాటుపడిన మహానుభావులను తలుచుకుంటే ఉదారవాదులకు ఎందుకో అంత కడుపునొప్పి..

శివాజీ విగ్రహాలను ఇటీవల కాలంలో హిందువులు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. తమ జాతి ఐక్యతకు శివాజీ మహారాజ్ కృషి చేశారని కొనియాడుతున్నారు. జయంతి.. ఇతర ఉత్సవాల సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహాలను ఊరేగిస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడు హిందువుల్లో ఐక్యత పెరిగిపోయింది. వారిలో చైతన్యం ఎక్కువైంది. అందువల్లే తమ జాతి అభ్యున్నతికి కృషి చేసిన వారందరినీ తలచుకుంటున్నారు. స్మరించుకుంటున్నారు. హిందువులు గొప్పగా చెప్పుకునే వ్యక్తులలో శివాజీ మహారాజ్ ఒకరు.

మహారాష్ట్రలో అద్భుతమైన పరిపాలన అందించి.. మహారాష్ట్ర ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు శివాజీ. నేటికీ మహారాష్ట్రలో శివాజీ ని తలవని ప్రాంతం.. స్మరించని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే శివాజీ విగ్రహాలను మనదేశంలో ఏర్పాటు చేయడం ఇటీవలీ కాలంలో పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి ఇజ్రాయిల్ కూడా వచ్చి చేరింది. అదేంటి ఇజ్రాయిల్ కు, శివాజీకి ఏంటి సంబంధం.. ఇజ్రాయిల్ దేశం ఎందుకు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది.. అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.

ఇజ్రాయిల్ దేశంలో యూదులపై హింస చెలదగింది. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో వినయ్ ఇజ్రాయిల్ తెగ ప్రజలు ఓడలో ముంబై నగరానికి వచ్చారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని.. వ్యాపారాలు మొదలుపెట్టారు. సరిగ్గా 17వ శతాబ్దంలో శివాజీ వారి స్థావరాలను గుర్తించారు. సామర్ధ్యాలను పరీక్షించారు. ఆ తర్వాత వారిని తమ సైన్యంలో చేర్చుకున్నారు. అలా మరాఠీలు.. యూదులు కలిసిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు వారి మధ్య బలమైన బంధం ఉంది. ఆ బంధాన్ని మరింత బాధపేతం చేసుకోవడానికి ఇజ్రాయిల్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

శివాజీ శౌర్యత్వానికి.. వీరత్వానికి ప్రతీక అని ఇజ్రాయిల్ దేశస్తులు చెబుతుంటారు. అతడిని తమ వాళ్ళ ప్రాణాలు కాపాడిన వీరుడిలాగా చెబుతుంటారు. మన పక్కనే ఉన్న పాకిస్తాన్ హిందుస్థాన్ సంస్కృతిని నాశనం చేయాలని చూస్తోంది. తమ దేశంలో ఉన్న భారత మూలాలను తొక్కిపెట్టేస్తోంది. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం శివాజీ చేసిన మంచితనాన్ని గుర్తించి.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికీ భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఇజ్రాయిల్ దేశం కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version