Homeఅంతర్జాతీయంPakistan counter terrorism operations: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట...మరో కీలక నేతను లేపేసిన అజ్ఞాత వ్యక్తులు!

Pakistan counter terrorism operations: పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట…మరో కీలక నేతను లేపేసిన అజ్ఞాత వ్యక్తులు!

Pakistan counter terrorism operations: పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్‌ దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది. ఒకవైపు అంతర్గతంగా నక్సలిజం.. మరోవైపు పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. ఈ క్రమంలో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్రం దేశంలో వేళ్లూనుకున్న నక్సలిజం, మావోయిస్టులను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసింది. మార్చి 31 నాటికి దాదాపు 90 శాతం మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలినవారు కూడా అదేబాటలో ఉన్నారు. అగ్రనేత గణపతి లొంగిపోతే మావోయిస్టులు ముగిసినట్లే. ఈ క్రమంలో కేంద్రం పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర లింక్కుల కత్తిరింపు.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను టార్గెట్‌ చేసింది. దేశంలోని ఉగ్రవాదులను, ఓవర్‌ గ్రౌండ్‌ నెట్‌ వర్క్‌లను ఏరివేస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌లో దురంధర్‌ సినిమా తరహాలో అజ్ఞాత సాయుధులు భారత వ్యతిరేక ఉగ్రవాదులను లేపేస్తున్నారు. ఇప్పటికే వంద మందికిపైగా ఉగ్రవాదులను సాయుధుల మట్టుబెట్టారు. దీంతో పాకిస్తాన్‌ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద మూకలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో లష్కరే–ఎ–తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన షేక్‌ యూసుఫ్‌ అఫ్రీదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాక్‌ వ్యాప్తంగా గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతుండటం ఉగ్రవాద సంస్థల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఉగ్రవాదులను టార్గెట్‌ చేసిన అజ్ఞాత వ్యక్తులు..
గత కొంతకాలంగా పాకిస్తాన్‌ కేంద్రంగా భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ముఫ్తీ హబీబుల్లా హక్కానీ, షేక్‌ మోయిజ్‌ ముజాహిద్, అబూ ఖతల్‌ వంటి మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు సైతం ఇలాగే గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. ఈ తరహా ఘటనలు ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఇప్పుడు సురక్షితమైన ఆశ్రయం కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అభద్రతలో ఉగ్రవాద సంస్థలు
పాక్‌ ఆర్మీ రక్షణలో ఉన్నామని భావించే ఉగ్రనేతలకు కూడా ఈ పరిణామాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. లాహోర్‌ వంటి నగరాల నడిబొడ్డున కూడా ఉగ్రవాద నేతలపై కాల్పులు జరగడం, పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఒకప్పుడు భారత్‌లో మారణహోమానికి పాల్పడిన నేతలు ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాల్లో భయాందోళనలను పెంచడమే కాకుండా, వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version