Pakistan double game: ఏ దేశానికైనా సరే ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాల తగ్గట్టుగానే ఆదేశ విధానాలు ఉంటాయి. ఆ విధానాలు ఆమోద దాయకంగా ఉండాలి. అంతేగాని గోడ మీది పెళ్లి లాంటి వ్యవహారం లాగా ఉండకూడదు. ప్రస్తుతం ఇదే విధానాన్ని పాకిస్తాన్ పాటిస్తోంది.. ఒకవేళ దొరికిపోతే ఆ దేశానికి ప్రతిరోజు దేత్తడి పోచమ్మ గుడే.
పాకిస్తాన్ దేశానికి ఒక విదేశీ విధానం అంటూ ఉండదు.. ఎక్కడ అప్పు పుడితే అక్కడికి వెళుతుంది. ఆ దేశానికి గులాం లాగా మారిపోతుంది.. చివరికి గల్ఫ్ లో ప్రతి దేశం వద్ద అప్పు తీసుకోవడానికి వెనుకాడదు. చెల్లించమంటే మాత్రం కుంటి సాకులు చెబుతూ ఉంటుంది. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని గల్ఫ్ దేశాలు పెద్దగా నమ్మవు. ఇటీవల యూఏఈ అప్పు చెల్లించాలని గట్టిగా అడిగింది. దీంతో పాకిస్తాన్ అన్ని మూసుకొని అప్పు చెల్లించే పనిలో పడింది. అప్పు చెల్లించడానికి ఫారెక్స్ నిల్వలను ఖర్చు చేయడానికి కూడా పాకిస్తాన్ వెనుకాడ లేదు.
ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ కొనసాగుతున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాల్సిన పాకిస్తాన్.. డబుల్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగంగా సౌదీ అరేబియా కు 8,000 మంది సైన్యాన్ని, 16 జెట్ విమానాలను పంపించింది. చివరికి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా అందులోకి దింపింది. ఓవైపు ఇరాన్, అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇరాన్ దేశానికి బద్ధ శత్రువు సౌదీ అరేబియాతో స్నేహం కొనసాగిస్తోంది. మొత్తానికి అటు ఇటు డబుల్ గేమ్ ఆడుతూ.. పాకిస్తాన్ పబ్బం గడుపుతున్నది. అయితే ఎంతకాలం ఈ డబుల్ గేమ్ ఆడుతుందో చూడాల్సి ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
పాకిస్తాన్ వ్యవహార శైలి తెలిస్తే అటు ఇరాన్ ఊరుకోదు. ఇటు సౌది అరేబియా అసలు వదిలిపెట్టదు. ఆర్థికంగా ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కంటే అత్యంత మెరుగైనవి. ఒకవేళ ఈ రెండు దేశాలకు కోపం వస్తే పాకిస్తాన్ ఈ ప్రపంచ పటం మీద ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
