Homeఅంతర్జాతీయంNarendra Modi Pakistan Debate: పాకిస్తాన్ దెబ్బకు నరేంద్ర మోడీ తోక ముడిచాడా.. మీకో దండం...

Narendra Modi Pakistan Debate: పాకిస్తాన్ దెబ్బకు నరేంద్ర మోడీ తోక ముడిచాడా.. మీకో దండం రా అయ్యా

Narendra Modi Pakistan Debate: కుక్కకు సింహం లాంటి ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుంది.. బురదలో దొర్లే పందిని సింహాసనం మీద కూర్చోబెడితే ఎలా ఉంటుంది.. పాకిస్తాన్ విషయంలో ఓవర్గం మీడియా చేస్తున్న అతి కూడా ఇలానే ఉంది. అసలే ఆ దేశానికి ఆర్థిక వనరులు లేవు. ప్రజల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు. దారుణంగా పన్నులు వేస్తున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక ఉన్న ఆ కాస్త ఫారెక్స్ నిల్వల నుంచి చెల్లిస్తోంది. యూఏఈ పాకిస్తాన్ దేశస్థులను తమ దేశం నుంచి వెళ్లగొడుతోంది. ఐఎంఎఫ్ బెల్ అవుట్ ఇవ్వకుండా పాకిస్తాన్ సహనాన్ని పరీక్షిస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద బీభత్సంగా దెబ్బ కొడుతోంది. చివరికి గల్ఫ్ దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని నమ్మడం లేదు.

ఉగ్రవాదులు కూడా అబ్రహం అకార్డ్స్ విషయంలో పాకిస్తాన్ పాలకులను బెదిరిస్తున్నారు. తిక్క తిక్కగా ప్రవర్తిస్తే చుక్కలు చూస్తారంటూ హెచ్చరిస్తున్నారు. అమెరికాతో అంట కాగితే ఖబర్దార్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ఏ విధంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది.. ఏ స్థాయిలో ఆ దేశానికి అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉన్నాయి.. కానీ ఇవేవీ కొన్ని మీడియా సంస్థలకు పట్టవు. వాటికి కావాల్సింది కేవలం భారత వ్యతిరేకత. అందువల్లే పాకిస్తాన్ దేశాన్ని గొప్పగా కీర్తిస్తున్నాయి.

పుల్వామా ఎటాక్.. పహల్గామ్ దాడి భద్రతాపరమైన లోపాల వల్ల జరిగాయట.. అందులో ఉగ్రవాదుల దుర్మార్గం ఏదీ లేదట. పైగా వీటికి సాక్షాలను అంతర్జాతీయ సమాజం ముందు ఉంచడంలో భారత్ విఫలమైందట. అప్పట్లో కేరళలో జరిగిన సమావేశంలో పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచం నుంచి ఒంటరి చేస్తామని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మీద నిలబడలేదట. పైగా ఇప్పుడు చైనా, అమెరికా పాకిస్తాన్ దేశానికి అండగా ఉంటున్నాయట. ఈ విషయంలో నరేంద్ర మోడీ ఏమి చేయలేకపోతున్నారట.

చైనా అనేది సామ్రాజ్యవాదం దేశం. అమెరికా అనేది సైతాన్ దేశం. ఈ రెండు దేశాలకు కేవలం వనరులు.. తాము చెప్పినట్టు ఆడించే వత్తాసు పాలకులు మాత్రమే కావాలి. అందువల్లే పాకిస్తాన్ దేశంతో ఇవి స్నేహం నటిస్తున్నాయి. ఒకవేళ ఇదంతా నిజమే అనుకుంటే ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ లో పర్యటించడం లేదు.. చైనా అధ్యక్షుడు ఎందుకు పాకిస్తాన్ వెళ్లడం లేదు.. స్థూలంగా పాకిస్తాన్లో ఉన్న వనరులు ఈ రెండు దేశాలకు కావాలి. పైగా భారత్ మీద పెత్తనం సాగించాలని అమెరికాకు, డ్రాగన్ దేశానికి ఒక స్థావరం కావాలి. అందువల్లే పాకిస్తాన్ దేశంతో అవి స్నేహం నటిస్తున్నాయి.

ఒకసారి తేడా కొడితే పాకిస్తాన్ దేశాన్ని అవి ఏం చేయాలో అదే చేస్తాయి. చైనా అవసరం లేకుండా.. అమెరికాతో సంబంధం లేకుండా భారత్ ఏమైనా చేయగలుగుతుంది.. అది పాకిస్తాన్ వల్ల అవుతుందా.. అమెరికా దయ లేకపోతే.. చైనా బిచ్చం వెయ్యకపోతే పాకిస్తాన్ బతికే పరిస్థితి లేదు.. చివరికి చీనాబ్ నది నుంచి నీళ్లు వదలకపోతే పాకిస్తాన్ ఎడారి అవుతుంది.. ఇన్ని తెలిసిన కూడా మీడియా సంస్థలు పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా రాస్తున్నాయి అంటే ఇది మామూలు పైత్యం కాదు. ఎన్ని రకాల మందులు వాడినా ఇది తగ్గదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version