Pakistan betrayal Muslim countries: ఖతార్పై ఇజ్రాయెల్ దాడి.. పాకిస్తాన్పై బారత ఆపరేషన్ సిందూర్ తార్వత ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఇస్లామిక్ నాటోకు తొలి అడుగు వేశారు. కానీ అదే పాకిస్తాన్ ఇప్పుడు ముస్లిం దేశమైన ఇరాన్కు వెన్నుపోటు పొడిచింది. మత ఐక్యత గురించి మాట్లాడే ఈ దేశం, వాస్తవానికి స్వార్థ రాజకీయాలతో ఇరాన్ను అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గురిచేసింది.
బలూచ్ తీవ్ర దాడులు..
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ను ఆనుకుని ఆఫ్గానిస్తాన్లో ఉన్న ప్రాంతం సీస్తాన్–బలూచిస్తాన్. ఇక్కడ నివసించే బలూచ్ ప్రజలు ఎక్కువగా సున్నీ ముస్లింలు, కాగా ఇరాన్లోని బలూచ్లు షియా మతానికి చెందినవారు. మతపరమైన విభజనను ఇదే అడ్డుకుంటోంది.
అమెరికాకు షరతులు..
ఇరాన్–అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ఐదు దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్ ఉన్నాయి. ఆయా దేశాల జెండాలు ఎగురవేసుకుని వచ్చేవాటిని మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పాకిస్తాన్ జెండాతో వచ్చిన కొన్ని నౌకలు వాస్తవానికి అమెరికాకు చెందినవి అని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ తన ఎయిర్ బేస్లను అమెరికాకు అందుబాటులో ఉంచి, ఇరాన్పై దాడులు చేయడానికి కల్పించింది.
ముస్లిం ఐక్యతపై నీళ్లు..
తాజాగా పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాలు గల్ఫ్ యుద్ధంపై సమావేశమయ్యాయి. ందులో ఇజ్రాయెల్ ప్రతినిధి పాల్గొనలేదు. ఇరాన్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని ‘ఇంటర్నేషనల్ స్టెబులైజేషన్ ఫోర్స్’లో పాకిస్తాన్ చురుకుగా పాల్గొంటోంది.
ఇది స్పష్టంగా పాకిస్తాన్ ఇజ్రాయెల్–అమెరికా కూటమి పక్షాన నిలిచిందని నిరూపిస్తోంది.
యూరోపియన్ యూనియన్ వైఖరి?
క్రై స్తవ దేశాలు, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఇరాన్పై యుద్ధం విషయంలో మౌనంగా ఉన్నాయి. స్పెయిన్ తన నావల్ బేస్, ఎయిర్ బేస్ ఇవ్వడానికి నిరాకరించి, తన ఎయిర్ స్పేస్ను మూసివేసింది. యూరోపియన్ యూనియన్ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
ముస్లిం దేశమే వెన్నుపోటు…
ముస్లిం దేశమైన పాకిస్తాన్ మరో ముస్లిం దేశమపైన ఇరాన్పై అమెరికా దాడులను వ్యతిరేకించడం లేదు. తన సైనిక స్థావరాలను శత్రువుకు అందుబాటులో ఉంచింది. ఇరాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరోక్షంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్–ఆఫ్గానిస్తాన్లు కలిసి పాకిస్తాన్ను టార్గెట్ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ చరిత్ర మొత్తం మతం పేరుతో లబ్ధి పొందడం, మోసం చేయడంతోనే సాగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప, వాస్తవానికి సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందం కోసం ఇరాన్ను త్యాగం చేసింది. హర్మూజ్ జలసంధి ద్వారా అమెరికా నౌకలకు దారి చూపించి, ఇరాన్పై దాడులకు సహకరించింది. ఇజ్రాయెల్–అమెరికా కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల పాకిస్తాన్ కూడా భవిష్యత్తులో ప్రాంతీయ శత్రువుల చేతిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ముస్లిం దేశాల ఐక్యత గురించి మాట్లాడే పాకిస్తాన్, వాస్తవానికి ముస్లిం దేశాలకే వెన్నుపోటు పొడుస్తోంది.
