spot_img
Homeఅంతర్జాతీయంMaldives: భారత్‌ దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు.. అట్లుంటది మరీ!

Maldives: భారత్‌ దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు.. అట్లుంటది మరీ!

Maldives: భారత్‌తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుంది. చైనా అండ చూసుకుని భారత్‌లో కయ్యానికి కాలు దువ్విన మాల్దీవులు ఇప్పుడు అసలుకే ఎసరు వస్తుందని గుర్తించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయంలో ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరైన పర్యాటకానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో దిగొచ్చిన మాల్దీవులు.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఏమైందంటే..
చైనా అనుకూల విధానం అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఈ క్రమంలో పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతినడంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సమతమతమవుతోంది. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అయిన మాల్దీవులకు ఇప్పుడు భారత్‌ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత్‌లోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని మాల్దీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రావెలింగ్‌ ఏజెంట్స్‌ అండ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ భావిస్తోంది. ఇందుకు భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతోంది.

మనమే కీలక మార్కెట్‌..
మాల్దీవులకు భారతే ఇప్పటికీ కీలక మార్కెట్‌. ఈ క్రమంలో తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్‌ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది. ప్రధాన నగరాల్లో రోడ్‌ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను పెపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెన్స్‌ సంస్థ తెలిపింది.

ఆరో స్థానానికి భారత్‌..
ఇక మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉండే భారత్‌.. ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. అధికారుల లెక్కల ప్రకారం.. ఈఏడాది ఏప్రిల్‌ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. ఇందులో 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్‌(66,999), రష్యా(66,803), ఇటలీ(61,379), జర్మనీ(52,256), భారత్‌(37,417)తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత పర్యాటకులు 60 శాతానికిపైగా తగ్గడంతో మాల్దీవుల ఆదాయం భారీగా పడిపోయింది. ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper