Homeఅంతర్జాతీయంOperation Sagar Bandhu: శత్రువులకు కూడా సాయం చేసే గొప్ప దేశం భారత్‌... ఇదే సాక్ష్యం

Operation Sagar Bandhu: శత్రువులకు కూడా సాయం చేసే గొప్ప దేశం భారత్‌… ఇదే సాక్ష్యం

Operation Sagar Bandhu: భారతదేశం పరస్పర సహకారం.. సానుభూతి, దయ కలిగిన దేశం. ఎదుటివారు కష్టాల్లో ఉంటే తోచిన సాయం చేసే గుణం మనది. ముఖ్యంగా మన పొరుగు దేశాలు మనపై శత్రుత్వ భావంతో ఉన్నా.. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మన వంతు సాయంగా అందిస్తున్నాం. తిరిగి రూపాయి కూడా ఆశించడం లేదు. తాజాగా దిత్వా తుపాన్‌ ప్రభావంతో శ్రీలంక అల్లకల్లోంగా మారింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. భారత్‌ మానవతా భావంతో స్పందించి. ఆపరేషన్‌ సాగర్‌ బంధు ద్వారా నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

శ్రీలంకకు భారీగా సాయం..
శ్రీలంకలో 2004 సునామీ సమయంలో 23 మిలియన్ల విలువైన సరుకులు, 2009 రాజకీయ సంక్షోభ కాలంలో రూ.500 కోట్ల సాయం, 2017, 2024 తరచూ వరదల సమయంలో కూడా భారతదేశం సహాయం అందించింది. తాజగా దిత్వా తుపాను ప్రభావంతో నష్టపోయిన శ్రీలకకు సాగర బంధు పేరుతో 12 టన్నుల సరుకులు పంపింది.

శత్రుదేశానికి కూడా కూడా సాయం
పాకిస్తాన్‌లో 2006లో వచ్చిన భూకంప సమయంలో భారత్‌ 50 మిలియన్‌ డాలర్ల సాయం పంపించింది. మన సైన్యం పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ప్రజలను రక్షించింది. వైద్య సాయం అందించింది. కానీ దీనిని విస్మరించిన పాకిస్తాన్‌.. 2008లో ముంబై ఉగ్రదాడి చేసింది.

మయన్మార్‌కు..
మయన్మార్‌లో టైపూన్‌ యాగి వచ్చిన సమయంలో కూడా భారత్‌ భారీగా సాయం చేసింది. కొన్ని నెలల క్రితం సైక్లోన్‌ మోచ వచ్చింది. దీంతో మయన్మార్‌ తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు కూడా భారీగా సాయం చేశాం.

టర్కీ భూకంప సమయంలో..
2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చిది. ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందు స్పందించిందిన మనమే. భారత సైన్యం సహాయం చేసింది. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ప్రజలకు సరుకులు, వైద్య సాయం చేసింది. కానీ దీనిని మర్చిపోయిన టర్కీ ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు డ్రోన్లు అందించి మనపై దాడికి ప్రోత్సహించింది. బంగ్లాదేశ్‌తో సహాకారం చూపించడం విరోధాభాసాలకు దారి తీసింది.

మానవత్వపు నిలువ
మన దేశం ఎప్పుడూ సహాయ దృక్పథంతోనే వ్యవహరిస్తుంది. సత్సంబంధాలు కోరుకుంటుంది. కానీ మన పొరుగున్న ఉన్న ఈ దేశాలను మనపై ఎప్పుడూ ద్వేష భావం ప్రదర్శిస్తున్నాయి. శత్రదేశాల ప్రజల మనసు గెలుచుకుంటున్నా.. అక్కడి పాలకులు మాత్రం కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version