Homeఅంతర్జాతీయంFrance Heatwave: షాపులు తెరవడమే ఆలస్యం.. అందినకాడికి ఏసీలు ఎత్తుకుపోతున్నారు.. అక్కడ ఎందుకిలా. ఏం జరుగుతోంది..

France Heatwave: షాపులు తెరవడమే ఆలస్యం.. అందినకాడికి ఏసీలు ఎత్తుకుపోతున్నారు.. అక్కడ ఎందుకిలా. ఏం జరుగుతోంది..

France Heatwave: అది శీతల దేశం. మహా అయితే ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించిపోదు. ఎండాకాలంలో కూడా అక్కడ ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉంటుంది.. అక్కడ సాధారణంగా ఏసీల వినియోగం కూడా అంతగా ఉండదు. చుట్టూ దట్టమైన కొండలు.. అంత ఎత్తున ఉండే వృక్షాలు ఆ దేశాన్ని సరికొత్తగా చూపిస్తుంటాయి. ఆ దేశాన్ని సందర్శించడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పైగా ఆ ప్రాంతంలో చలిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా గీజర్లు ఉంటాయి. అయితే అటువంటి ఆ శీతల దేశంలో పరిస్థితి మారిపోయింది. ఎంతలా అంటే.. యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసేలా..

ఫ్రాన్స్ పేరు చెబితే ప్రపంచానికి ఫ్యాషన్ గుర్తుకొస్తుంది. అక్కడ ప్రతిరోజు ఫ్యాషన్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహా అయితే ఉష్ణోగ్రత 25° మించదు. కానీ ఇప్పుడు ఫ్రాన్స్ దేశం నిప్పుల కొలిమి మీద ఉంది. ఎండవేడికి తట్టుకోలేక అక్కడి ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడుకోవడానికి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు. సాయంత్రమైతే చాలు బీచ్ లలో సేద తీరుతున్నారు.. వాస్తవానికి అక్కడ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి ప్రజలు కలలో కూడా ఊహించలేదు.. ఎండ వేడిమి ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతుంటే తమకు ఇంట్లో ఉండాలని కూడా అనిపించడం లేదని అక్కడ ప్రజలు అంటున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అక్కడ ఎండ వేడిమి అలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఒమేగా ఎఫెక్ట్. పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల అక్కడ ఒమేగా ఎఫెక్ట్ చోటుచేసుకుంది. దీనికి తోడు అక్కడి వాతావరణం లో మార్పులు కూడా అనూహ్యంగా ఉంటున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అక్కడ ప్రజలు ఏసీలు కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అక్కడ ఏసీల కొనుగోళ్లు పెరిగిపోయాయి. షాపులు ఓపెన్ చేయడమే ఆలస్యం.. ఏసీలు కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రజలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఫ్రాన్స్ లో చాబర్ అనే ప్రాంతంలో ఓ షాపు ఓపెన్ చేయగానే అందులోకి ప్రజలు భారీగా వచ్చారు. ఏసీలు కొనుగోలు చేశారు. కూరగాయలు.. ఉల్లిపాయలు కొనుగోలు చేసినట్టు ఏసీలను కొనుక్కున్నారు. అలా ప్రజలు ఏసీలు కొనుగోలు చేయడం అక్కడ పరిస్థితిని తేట తెల్లం చేస్తోందని నెటిజన్లు అంటున్నారు.

ఎండ వేడి పెరిగిపోవడంతో చల్లదనం కోసం ప్రజలు తాపత్రయపడుతున్నారు
. అందువల్ల ఇలా ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏసీలను కొనుగోలు చేసేవారి సంఖ్య అక్కడ పెరిగిపోయింది. అందువల్లే అన్ని షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని షాపులలో అయితే. ఔట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
image.png

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version