Homeఅంతర్జాతీయంIndia strikes on Pakistan: భారత్ తెగించి పాక్ పై చేసిన దాడి.. అమెరికా కూడా...

India strikes on Pakistan: భారత్ తెగించి పాక్ పై చేసిన దాడి.. అమెరికా కూడా భయపడింది

India strikes on Pakistan: రష్యా మీద అమెరికా యుద్ధం చేయలేదు. చైనా మీద కూడా చేయలేదు. చివరికి ఇజ్రాయిల్ జోలికీ వెళ్లలేదు. కారణం ఆ దేశాలలో న్యూక్లియర్ వెపన్స్ ఉండడమే.. మన దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇటీవల ఆ వివరాలను మన దేశమే ప్రకటించింది.. మేము ఎవరి మీద బాంబులు వేయము. మాకు ఆ అవసరం లేదు. ఒకవేళ బాంబులు వేస్తే.. ఆ తర్వాత కథ వేరే విధంగా ఉంటుందని హెచ్చరించింది.

వాస్తవానికి మన దేశం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. గతంలో న్యూక్లియర్ టెస్టులు జరిగినప్పుడు అమెరికా అనేక విధాలుగా అడ్డుకుంది. అమెరికా అడ్డు పుల్ల వేయడంతో ఇందిరాగాంధీ హయాంలో న్యూక్లియర్ టెస్టులు ఆగిపోయాయి. కానీ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు న్యూక్లియర్ టెస్ట్లు చేశారు. అమెరికా అనేక రకాలుగా ఆంక్షలు విధించినప్పటికీ ఏమాత్రం లెక్కపెట్టలేదు. పైగా నాడు ప్రధానమంత్రి హోదాలో అటల్ జీ అమెరికాకు స్పష్టమైన సంకేతాలు పంపించారు.

“మాకు చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోవడం అవసరం. మేము వేరే దేశాల మీద బాంబులు వేసే వాళ్ళం కాదు. మా మీద బాంబులు వేస్తే ఊరుకునే రకం కూడా కాదు. మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం. దాన్ని కూడా కాదనే అధికారం మీకు లేదంటూ” అటల్ ప్రశ్నించారు..

ఇక ఇటీవల ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు మన దేశానికి సంబంధించిన మిస్సైల్స్ పాకిస్తాన్ మీద దాడి చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తయారుచేసిన న్యూక్లియర్ వెపన్స్ ప్రాంతంలో ఎంట్రీ లెవెల్ గేట్లను బద్దలు కొట్టాయి. అంతేకాదు న్యూక్లియర్ రిఫరెన్స్ స్టోర్ చేసే ప్రాంతంలో అనేక వ్యవస్థలను నాశనం చేశాయి. దీనిని పాకిస్తాన్ బయట పెట్టలేదు. కానీ సి ఐ ఏ పరిశీలనలో తేలింది. అంతేకాదు సిఐఏ ఇచ్చిన తాజా నివేదిక అమెరికాకు చుక్కలు చూపించింది.

బాంబులతో దాడి కాదు.. బాంబులు చూపించి ప్రపంచాన్ని భయపెట్టిన దేశంగా భారత్ నిలిచిందని.. భారత్ విషయంలో అమెరికా అడ్డగోలుగా ప్రవర్తిస్తే తర్వాతి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని సిఐఏ హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏకకాలంలో అటు పాకిస్తాన్ దేశానికి.. ఇటు అమెరికాకు భారత్ స్పష్టమైన హెచ్చరికలు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా పాకిస్తాన్ అదుపులో ఉంటే మంచిదని జాతీయవాదులు చెబుతున్నారు. అమెరికా కూడా అనవసరమైన విషయాలలో కలగజేసుకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version