Homeఅంతర్జాతీయంBangladesh Crisis: పాక్ కాదు.. "బంగ్లాదేశ్" నుంచి భారత్ కు అతి పెద్ద ముప్పు

Bangladesh Crisis: పాక్ కాదు.. “బంగ్లాదేశ్” నుంచి భారత్ కు అతి పెద్ద ముప్పు

Bangladesh Crisis: మన దేశానికి అతిపెద్ద శత్రువు పాకిస్తాన్.. ఆ దేశం నుంచే మనకు ముప్పు పొంచి ఉంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ వెంటనే మన భద్రతా దళాలు నిత్యం గస్తి కాస్తుంటాయి. అయితే పాకిస్తాన్ నుంచి కాకుండా, మనకు ప్రధాన ముప్పు బంగ్లాదేశ్ నుంచి పొంచి ఉందని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది.. బంగ్లాదేశ్ లో విముక్తి యుద్ధం తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని.. అది భారతదేశానికి అతిపెద్ద ఇబ్బందిగా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశిధరూర్ నేతృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్నా రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న రకరకాల ప్రభావాలు, పాకిస్తాన్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవి కోల్పోవడం.. ఈ పరిణామాలపై భారత జాగ్రత్తగా ఉండాలని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. బంగ్లాదేశ్ విషయంలో భారత్ తన వ్యూహాన్ని మరోసారి సమీక్షించుకోవాలని సూచించింది.

“1971లో అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అవి ఒక కొత్త ఆవిర్భావానికి దారితీసాయి. ఇప్పుడు ఆ సవాల్ మరింత తీవ్రంగా మారింది.. తరాల మధ్య అంతరం ఏర్పడిన నేపథ్యంలో రాజకీయ వ్యవస్థలో మార్పు కావాల్సిందే. భారతదేశం ఇప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించాలని” పార్లమెంటరీ కమిటీ సూచించింది. అంతేకాదు పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ సాగిస్తున్న సంబంధాలు, బంగ్లాదేశ్ లో చిన్న పెడుతున్న పెట్టుబడులు ఆందోళన కలిగిస్తున్నాయని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది.. Mongla port, లాల్మో నిర్హాట్ ఎయిర్ బేస్, పెకువా జలాంతర్ గామే స్థావరం వంటి విషయాలను పార్లమెంటరీ కమిటీ ప్రముఖంగా ప్రస్తావించింది.

బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామి అనే సంస్థ బలంగా కూతలు ఉందని.. దీన్ని కూడా చైనా కలుపుకుపోతోందని.. తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి చైనా ముమ్మరంగా అడుగులు వేస్తోందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డెవలప్మెంట్, కనెక్టివిటీ, పోర్ట్ ల అనుసంధానం వల్ల బంగ్లాదేశ్ ను చైనా నుంచి దూరం చేయవచ్చని పార్లమెంటరీ కమిటీ సూచించింది. బంగ్లాదేశ్ లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడుతున్నాయని, షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం వంటి పరిణామాలు బంగ్లాదేశ్లో ఏమైనా చేస్తాయని.. వచ్చే ఎన్నికల్లో అందరిని కలుపుకొని పోయే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలని పేర్కొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
Oktelugu Epaper