Homeఅంతర్జాతీయంPakistan: పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధుల దూకుడు.. మరో నలుగుర్ని లేపేశారు!

Pakistan: పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధుల దూకుడు.. మరో నలుగుర్ని లేపేశారు!

Pakistan: పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధులు రెచ్చిపోతున్నారు. ఉగ్రవాదులు.. వారికి అనుకూలంగా ఉన్నవారిని మట్టుబెడుతున్నారు. తాజాగా నలుగురు ఐఎస్‌ఐఎస్‌ కొరాసాన్‌ విభాగ ముఖ్య నాయకులను బలవంతంగా తొలగించడం స్థానిక భద్రతా పరిస్థితులకు కొత్త దశ తీసుకొచ్చాయి. ఈ ఉగ్రవాదులు ఆఫ్గాన్‌లోని కొరాసాన్‌ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హింసాత్మక జథాలలో ఉన్నవారిగా గుర్తింపు పొందారు. ఐఎస్‌ఐఎస్‌ కొరాసాన్‌ విభాగం, తాలిబాన్‌ మధ్య నెలకొన్న విరోధాలు ఈ దాడులకు ప్రధాన కారణాలు. పలువురు పాక్‌ ఉగ్రవాద నిపుణులు, ఈ హత్యలు పాకిస్తాన్‌లోని […]

Pakistan: పాకిస్తాన్‌లో అజ్ఞాత సాయుధులు రెచ్చిపోతున్నారు. ఉగ్రవాదులు.. వారికి అనుకూలంగా ఉన్నవారిని మట్టుబెడుతున్నారు. తాజాగా నలుగురు ఐఎస్‌ఐఎస్‌ కొరాసాన్‌ విభాగ ముఖ్య నాయకులను బలవంతంగా తొలగించడం స్థానిక భద్రతా పరిస్థితులకు కొత్త దశ తీసుకొచ్చాయి. ఈ ఉగ్రవాదులు ఆఫ్గాన్‌లోని కొరాసాన్‌ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హింసాత్మక జథాలలో ఉన్నవారిగా గుర్తింపు పొందారు. ఐఎస్‌ఐఎస్‌ కొరాసాన్‌ విభాగం, తాలిబాన్‌ మధ్య నెలకొన్న విరోధాలు ఈ దాడులకు ప్రధాన కారణాలు. పలువురు పాక్‌ ఉగ్రవాద నిపుణులు, ఈ హత్యలు పాకిస్తాన్‌లోని భద్రతా వ్యవస్థపై కీలక సవాలు అనబడుతుండగా, కొరాసాన్‌ సమూహం పాక్‌ అంతర్గత పరిస్థితులను ఇంకా ఉద్రిక్తతకిరావడానికి ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు.

ఐఎస్‌కేపీ నేపథ్యం..
ఐఎస్‌కేపీ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖోరాసాన్‌ ప్రావిన్స్‌) పాకిస్తాన్‌లో 2016–17 నుంచి తాలిబాన్‌కు వ్యతిరేకంగా తమ శక్తిని పెంచుతూ పాల్గొంటోంది. ఈ ఘర్షణలు పాక్‌–ఆఫ్గాన్‌ సరిహద్దులోని సుదీర్ఘ సమస్యలకు సంబంధించి మరింత ఉద్రిక్తతను తీసుకువచ్చాయి. ఈ పరిస్థితుల్లో, పాక్‌ ఆజ్ఞాపనలతో ఉగ్రవాదులను అజ్ఞాతంలోకి పంపించాలన్న ఆదేశాలు బయటకు వచ్చాయి.

నలుగురు వీరే…
చనిపోయిన నలుగురిలో ఒకడు అబూ తాహెర్‌ అల్‌ కొరాసా, రెండో అతను ఇగ్రిస్‌.. వీరిని జలాలాబాద్‌ హైవేపై చంపేశారు. మూడో వ్యక్తి బుర్హాన్‌ అలియాస్‌ అబూబాకర్, నాలుగో వ్యిక్త అబూ హల్‌ జల్‌ హిందీ. ప్రెస్‌నోట్‌లు విడుదల చేస్తాడు. ఐఎస్‌ఏపీ అధినేత గఫూర్‌.. పాకిస్తాన్‌లో ఉంటాడు. పాకిస్తాన్‌ అతిథి గృహాల్లో ఉంటాడు. ఇతనికి సన్నిమితులు చనిపోయిన నలుగురు. దీంతో పాకిస్తాన్‌ నష్టపోయింది. అజ్ఞాత గన్‌మెన్‌లు పరోక్షంగా భారత్‌కు సాయం చేస్తోంది. పాకిస్తాన్‌ మాత్రం ఇది భారత్‌ రా ఏజెంట్ల పని అని ఆరోపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper