Homeఅంతర్జాతీయంAfghanistan Vs Pakistan: పాకిస్తాన్‌ను నమ్మని ఆఫ్గానిస్తాన్‌.. చర్చల కన్నా యుద్ధానికే మొగ్గు!

Afghanistan Vs Pakistan: పాకిస్తాన్‌ను నమ్మని ఆఫ్గానిస్తాన్‌.. చర్చల కన్నా యుద్ధానికే మొగ్గు!

Afghanistan Vs Pakistan: పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తెహ్రీక్‌ – ఎ – తాలిబాన్‌ పాకిస్తాన్‌ తమపై దాడులు చేస్తుందన్న సాకుతో పాకిస్తాన్‌ వైమానిక దాడులు చేసింది. ప్రతిగా ఆఫ్గానిస్తాన్‌ కూడా సైనిక దాడులు చేసింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఖతార్, సౌదీ అరేబియా శాంతి ప్రయత్నాలు ప్రారంభించాయి. దోహా, ఇస్తాంబుల్, తుర్కియేలో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత పాకిస్తాన్‌–ఆఫ్ఘానిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. పాకిస్తాన్‌ చేస్తున్న దాడులకు సంబంధించిన ఆధారాలను ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం […]

Afghanistan Vs Pakistan: పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తెహ్రీక్‌ – ఎ – తాలిబాన్‌ పాకిస్తాన్‌ తమపై దాడులు చేస్తుందన్న సాకుతో పాకిస్తాన్‌ వైమానిక దాడులు చేసింది. ప్రతిగా ఆఫ్గానిస్తాన్‌ కూడా సైనిక దాడులు చేసింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఖతార్, సౌదీ అరేబియా శాంతి ప్రయత్నాలు ప్రారంభించాయి. దోహా, ఇస్తాంబుల్, తుర్కియేలో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత పాకిస్తాన్‌–ఆఫ్ఘానిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. పాకిస్తాన్‌ చేస్తున్న దాడులకు సంబంధించిన ఆధారాలను ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం చర్చల్లో బయట పెడుతోంది. పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌ వాటిని ఖండించకపోగా ‘‘అవి మా భద్రతా చర్యలు’’ అని సమర్థిస్తోంది.

ఒకవైపు ప్రాధేయపడుతూ.. ఇంకోబైపు గాంభీర్యం..
శాంతి చర్చల సమయంలో పాక్‌ హోం మంత్రి ముసీన్‌ నఖ్వీ సమాధానభావాన్ని ప్రదర్శించినా, బయట యుద్ధ వచనాలతో ఉత్కంఠను పెంచుతున్నారు. సమావేశాల్లో వినయపూర్వకంగా వ్యవహరించిన నఖ్వీ, పబ్లిక్‌లో మాత్రం ఆఫ్ఘాన్‌ను ‘పాఠం చెబుతాం, తుడిచేస్తాం’ అని బెదిరించి ద్వంద్వప్రతిక్రియ చూపుతున్నారు. ఈ మాటలే తాలిబాన్లలో అసంతృప్తిని పెంచి, చర్చలకు దూరం చేస్తున్నాయి. ఇటీవలి వారాల్లో ఖైబర్‌–ఫఖ్తూంఖ్వా ప్రాంతంలో పాక్‌ సైనికుల మృతి పెరిగింది. తాలిబాన్‌ దాడులు మరింత చురుకుగా సాగుతున్నాయి. పాక్‌ మంత్రులు తారార్, ఖ్వాజా ఆసిం, నఖ్వీ వర్గాలు ఈ దాడులకు తెహ్రీక్‌–ఇ–తాలిబాన్‌ పాకిస్తాన్‌ (టీటీపీ)నే బాధ్యులుగా పేర్కొంటున్నాయి.

ఆఫ్గాన్‌ను బలహీనపర్చే కుట్ర..
ఆఫ్ఘానిస్తాన్‌లో అస్థిరత సృష్టించేందుకు ఐసిస్‌–ఖోరాసాన్‌ పేరిట పాక్‌ మద్దతుతో ఏర్పడుతున్న సాయుధ వర్గాలపై తాలిబాన్‌ ఆధారాలను ఉంచింది. ఈ కొత్త మిలిటెంట్‌ నెట్‌వర్క్‌ లక్ష్యం ఆఫ్ఘాన్‌ కేంద్ర పాలనను బలహీనం చేయడమేనని తాలిబాన్‌ ఆరోపిస్తోంది. దీని వెనుక పాకిస్తాన్‌ సైన్యపు ప్రణాళికలు ఉన్నాయా అనే అనుమానం అంతర్జాతీయ పరిశీలకుల్లో పెరుగుతోంది.

నీటికి చెక్‌..
రాజకీయ ఘర్షణలతోపాటు జలపరమైన వివాదం కూడా తీవ్రమవుతోంది. ఆఫ్ఘాన్‌ తన భూభాగం గుండా పాకిస్తాన్‌లో ప్రవహించే తొమ్మిది నదులపై డ్యాం నిర్మాణానికి తెరతీసింది. దాంతో పాక్‌కు సాగునీరు, తాగునీటి లభ్యత తగ్గిపోతోంది. రెండు దేశాల మధ్య జలాభ్యంతర ఒప్పందం లేకపోవడంతో ఇస్లామాబాద్‌ నిరసన వ్యక్తం చేసే అవకాశమే లేదు. ఈ ప్రాజెక్టులు పాకిస్తాన్‌ వ్యవసాయంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.

భారత్‌తో ఘర్షణల సమయంలో పాక్‌ వెనక్కి తగ్గినట్లు కనిపించినా, ఇప్పుడు అదే పరిస్థితి ఆఫ్ఘాన్‌ ముందు కూడా తలెత్తింది. తాలిబాన్‌ ప్రభుత్వం ఇక చర్చల కంటే ప్రత్యక్ష యుద్ధమే మేలు అన్నట్లుగా భావిస్తోంది. ‘‘పాకిస్తాన్‌ను నమ్మడం అసాధ్యం’’ అనే భావన కాబూల్‌లో ఉంది. దీంతో పాక్‌–ఆఫ్ఘాన్‌ సంబంధాలు అనిశ్చిత దిశలో కదులుతున్నాయి. సైనిక దాడులు, నీటి వివాదాలు, ఉగ్రవాదం పెరుగుదల ఇవన్నీ యుద్ధ మేఘాలకు కారణమవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper