Homeవైరల్ వీడియోస్Viral Video : ముసలాయనపై పంది దాడి..  ఏడుగురు కూడా ఆపలేకపోయారు.. వీడియో వైరల్.. అసలేం...

Viral Video : ముసలాయనపై పంది దాడి..  ఏడుగురు కూడా ఆపలేకపోయారు.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే? 

Viral Video :  అడవులు అంతరించపోతుండడంతో కొన్ని జంతువులు జనవాసాల మధ్య తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో తిరుమలలో చిరుత పులలు జాడలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే కనిపించే కోతులు ఇప్పుడు ఇళ్లల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడూ మనుషుల మధ్యకు రాని ఓ అడవి పంది గ్రామంలో చొరబడింది.  అక్కడికి రావడమే కాకుండా కొందరిపై దాడి చేసింది. వీరిలో ఓ వృద్ధుడిపై పగబట్టినట్లు వెంటబడింది. దీనిని చూసిన గ్రామస్థులు ఆ పందిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇందులో ఏడుగురు వ్యక్తులు పందిని ఆపలేకపోయారు. ఒళ్లు పులకరించే ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
వైల్డ్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులు రోజూ వారి సమయాల్లో ఏం చేస్తుంటాయి? వారి ఆహారం ఏంటి? అని తెలుసుకునేందకు కొందరు పరిశోధనాత్మకంగా కెమెరాలను ఉంచి వీడియోలు చిత్రీకరిస్తుంటారు. దీంతో ఇలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే జంతువులు ఒకదానికొకటి దాడులు చేసుకున్న వీడియోలు ఆసక్తిగా ఉంటాయి. అయితే తాజాగా ఓ అడవి పంది మనుషులపై దాడి చేసింది. సాధారణంగా అడవి పంది మనుషులను చూడగానే పరుగెడుతుంది. కానీ ఇది మాత్రం తిరగబడి దాడి చేసింది.
‘americasgoneviral’ అనే ఇన్ స్ట్రాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఒక అడవి పంది దూసుకుంటూ గ్రామంలోకి చొరబడింది. దానికి ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ దాడి చేసుకుంటూ ముందుకు వెళ్లింది. చివరికి ఒక వృద్ధుడిపై దాడి చేసింది. అయితే ఆ వృద్ధుడిని కాపాడేందుకు స్థానిక గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వీటిలో ఏడుగురు వ్యక్తులు ప్రత్యేకంగా పందిని విడిపించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి ఓ వ్యక్తి కర్ర పట్టుకొని అడవి పందిపై దాడి చేసినా ఏమాత్ర బెదరకుండా ఆ ముసలాయనను అలాగే కొరికి పట్టుకుంది. అయితే ఆ తరువాత ఏం జరిగింది? అనేది మాత్రం వీడియోలో లేదు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియోను చూసి చాలా మంది షాక్ అవుతూ ఉన్నారు. ఒక అడవి పంది ఇంతలా దాడి చేయడం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో అంత మంది మనుషులు ఉన్నా.. వారికి కాదని ఆ వృద్ధుడిని కొరికి పట్టుకోవడం చూసి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో పోస్టు చేసిన వెంటనే వైరల్ అవుతూ వస్తోంది. కొంత మంది మాత్రం అంతకుముందు ఆ పందిపై ఆ వృద్దుడు దాడి చేసి ఉంటారని, దీంతో పగబట్టిందని అనుకుంటున్నారు. ఏదీ ఏమైని ఇప్పటి వరకు ఎక్కడా చేయని విధంగా అడవి పంది దాడి చేయడం చూసి షాక్ అవుతూ ఉన్నారు. అయితే సాధారణంగా అడవి పందులు జనవాసాల్లోకి రావు. కానీ ఇది ఓ గ్రామంలోకి వచ్చి మరీ ఓ ముసలాయనపై దాడి చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular