Samantha: ఎంత విడిపోతే మాత్రం ఇలా చేస్తారా ? సమంత ఏమి చేసిందంటే ?

Samantha: టాలీవుడ్ లోనే ఒకప్పుడు ప్రేమకు ప్రతిరూపమైన జంట ఏదైనా ఉందంటే అది ‘నాగచైతన్య-సమంత’లదే. ఎన్నో ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా సాగిన ఈ జంట చివరకు మనస్పర్ధలతో 2021లో విడాకులు తీసుకున్నారు. వారి వైవాహిక సజావుగా సాగకపోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటించడం.. శృతిమించి ఎక్స్ పోజింగ్ చేయడమే వీరిమధ్య చిచ్చు పెట్టిందని వార్తలు ప్రచారం […]

Written By: NARESH, Updated On : February 15, 2022 11:19 am
Follow us on

Samantha: టాలీవుడ్ లోనే ఒకప్పుడు ప్రేమకు ప్రతిరూపమైన జంట ఏదైనా ఉందంటే అది ‘నాగచైతన్య-సమంత’లదే. ఎన్నో ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఎంతో అన్యోన్యంగా సాగిన ఈ జంట చివరకు మనస్పర్ధలతో 2021లో విడాకులు తీసుకున్నారు. వారి వైవాహిక సజావుగా సాగకపోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటించడం.. శృతిమించి ఎక్స్ పోజింగ్ చేయడమే వీరిమధ్య చిచ్చు పెట్టిందని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఏమైందో ఏమో కానీ.. విడాకుల ప్రకటన తర్వాత ఇద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు.

ఇక విడాకుల తర్వాత నాగచైతన్య పూర్తిగా మౌనం దాల్చగా.. సమంత మాత్రం ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేస్తూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హాట్ సినిమాలు, ఐటెం సాంగ్ లు చేస్తూ దుమారం రేపుతున్నారు.

సమంత-నాగచైతన్య విడిపోయాక వారి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరినీ కలిపేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని.. ఎవరికి నచ్చినట్టు వారు రాసుకున్నారు.

తాజాగా వీళ్లకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి అయిన తరువాత.. ఫస్ట్ నైట్ రోజు సమంతకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ఖరీదైన రింగ్ ను నాగచైతన్య బహుమతిగా ఇచ్చాడట.. ఆ రింగ్ ఎంతో ఇష్టంగా తమ పేర్లలోని మొదటి లెటర్స్ వచ్చేలా లవ్ గుర్తుతో డిజైన్ చేయించాడట.. చైతన్య ప్రేమతో ఇచ్చిన రింగ్ సమంతకు చాలా నచ్చగా దాన్ని జాగ్రత్తగా దాచుకుందట.. అయితే విడాకులు తర్వాత ఆ గిఫ్ట్ ని సమంత తన సాఫ్ట్ ద్వారా చైతన్యకు ఇచ్చిందట.. విడాకులు తీసుకోవడానికి సిద్దపడిన సమంత ఆ రింగ్ ను వెనక్కు ఇవ్వడం వల్ల ఆమె ఇంక చైతన్యతో ఉండడం ఇష్టం లేదు అని పరోక్షంగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.ఈ మేరకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ మధ్య రామానాయుడు స్టూడియోస్ లో ఇద్దరు ఎదురెదురు పడినా కూడా మాట్లాడుకోలేదట.. నాగచైతన్య నటిస్తున్న నటిస్తున్న బంగార్రాజు, సమంత నటిస్తున్న యశోద షూటింగ్ లు రామానాయుడు స్టూడియోలో జరగగా.. ఓ సమయంలో ఇద్దరు ఎదురుపడగా.. అస్సలు ముఖాలు చూసుకోలేదని టాక్.