spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham Letter: సీఎం జగన్ అంటే అంత భయమా? ముద్రగడ లేఖ వైరల్

Mudragada Padmanabham Letter: సీఎం జగన్ అంటే అంత భయమా? ముద్రగడ లేఖ వైరల్

Mudragada Padmanabham Letter: ముద్రగడ పద్మనాభం.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. మంత్రిగా, ఎంపీగా పనిచేశారు.అయితే ఆయన రాజకీయ నాయకుడి కంటే..కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే తెలుగునాట గుర్తింపు పొందారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం పతాక స్థాయికి తీసుకెళ్లారు. చంద్రబాబు సర్కారుపై గట్టిగానే పోరాడారు. అదే తుని రైలు విధ్వంసానికి దారితీసింది. అటు చంద్రబాబు స్పందించారు. ఈబీసీ రిజర్వేషన్లు 5 శాతాన్ని కాపులకు కేటాయించారు. అయితే ఇప్పుడు ఆ 5 శాతాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది. అయితే ఇది జరిగి మూడున్నరేళ్లవుతోంది. అటు సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆ 5 శాతం రిజర్వేషన్లు సహేతుకమేనని చెప్పడంతో ముద్రగడ స్పందించడం అనివార్యంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక ఉద్యమం అవసరం లేదని.. కాపు సంఘాలు తన వైపు అనుమానాపు చూపులు చూస్తున్నాయని ముద్రగడ ఉద్యమాన్ని బంద్ చేశారు. ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు కాపుల ఈబీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ తప్పనిసరి అయ్యింది. జగన్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ సమయంలో స్పందించకపోతే విమర్శలు వస్తాయని భావించిన ముద్రగడ సీఎం జగన్ కు లేఖ రాశారు.

Mudragada Padmanabham Letter
Mudragada Padmanabham Letter

అయితే ముద్రగడ భయం భయంతో సీఎం జగన్ కు లేఖ రాశారు. పూర్తి వినయ, విధేయతతో, వినమ్రతతో లేఖ రాసినట్టుంది. ముద్రగడ లేఖ రాశారనేదానికంటే.. లేఖ సారాంశమే ఇప్పుడు హైలెట్ అవుతోంది. ముద్రగడకు జగన్ అంటే అంత భయం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం లేఖ ఎందుకు రాశారో? డిమాండ్ ఏంటన్నది స్పష్టం చేయలేని స్థితిలో ముద్రగడ ఉండడం విమర్శలకు తావిస్తోంది. ముద్రగడ కొత్తగా అడుగుతున్నది ఏమీ లేదు. జగన్ తీసుకున్నదానినే పునరుద్ధరించమన్నది చిన్న విన్నపం. రైళ్లను తగులబెట్టి, విధ్వంసాలు సృష్టించే రేంజ్ లో ఉద్యమాలు చేశారు. నాటి సర్కారుపై చూపిన తెగువ, ధైర్యం ఇప్పుడెందుకు చూపలేకపోతున్నారన్నది ప్రశ్న. మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశ్యం కాదంటూ ముద్రగడ పేర్కొనడంపై కూడా సెటైర్లు పడుతున్నాయి.

2019లో ఏపీ అసెంబ్లీ ఒక చట్టం ద్వారా కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాపులు అడిగింది ఏమిటి? మీరు చేస్తున్నదేమిటి అంటూ గద్దెనెక్కిన జగన్ ఆ 5 శాతం రిజర్వేషన్లను రద్దుచేశారు. చట్టబద్దత లేని ఈబీసీ రిజర్వేషన్లతో కాపులు తాము బీసీలమా? ఓసీలమా? అని అనుమానం పడతారని కూడా చెప్పుకొచ్చారు.

Mudragada Padmanabham Letter
Mudragada Padmanabham , JAGAN

అయితే నాడు చంద్రబాబు సర్కారు కాపులకు అందించిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు సహేతుకమేనని సుప్రీం కోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి జగన్ సర్కారుకు దాపురించింది. కానీ ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. దీంతో ముద్రగడ ఎక్కడ అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయన సీఎం జగన్ కు భయపడుతూ లేఖ రాశారు. బతిమలాడుతూ విన్నపాలు చేసుకున్నారు. అందరూ అనుభవించగా మిగిలిన వాటికే అమలుచేయాలని కోరుతున్నామని… మిమ్మల్ని ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యం కాదని చెప్పుకొచ్చారు. ఈ రిజర్వేషన్లు అమలుచేసి కాపుల అండతో మరోసారి విజయం దక్కించుకోవాలని కూడా సూచించారుట. మొత్తానికి చాలా రోజుల తరువాత లేఖరాసిన ముద్రగడ జగన్ పట్ల చూపుతున్న వినయ విధేయతలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper