Homeట్రెండింగ్ న్యూస్Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరో లేఆఫ్‌.. అందులో జాబులు ఇక కష్టమే

Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్‌లో మరో లేఆఫ్‌.. అందులో జాబులు ఇక కష్టమే

Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్‌ వంటి సాంకేతిక దిగ్గజ సంస్థలు పోటీతత్వ ప్రపంచంలో ముందడుగు వేయడానికి కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో, మైక్రోసాఫ్ట్‌(Microsoft) మరోసారి ఉద్యోగ కోతలకు సన్నద్ధమవుతోంది. సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ, వ్యయాలను సమతుల్యం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వంటి భవిష్యత్‌ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తూ, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై కూడా దిగ్గజ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.

Also Read: CNG కార్లలో ఏది బెస్ట్?

ఎవరిపై ప్రభావం?
మైక్రోసాఫ్ట్‌ తాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతలు ప్రధానంగా మిడిల్‌ మేనేజ్మెంట్‌(Middle Management), నాన్‌–టెక్నికల్‌ ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కంపెనీలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచేందుకు, ప్రాజెక్ట్‌ బృందాలను సమర్థవంతంగా నడపడానికి ఈ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కోతలు మే నెలలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఎంతమంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందనే విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

గతంలో కూడా..
గతంలో కూడా మైక్రోసాఫ్ట్‌ తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజా కోతలు కూడా పనితీరు ఆధారంగా జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక కంపెనీ ఆర్థిక సమతుల్యత, పోటీతత్వాన్ని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.

టెక్‌ రంగంలో కొత్త ధోరణి
మైక్రోసాఫ్ట్‌ ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఇతర టెక్‌ దిగ్గజాలైన అమెజాన్(Amezan), గూగుల్‌ల(Google)తో సమానంగా ఉంది. నిర్వాహక (మేనేజ్‌మెంట్‌) పాత్రల కంటే సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఈ కంపెనీల వ్యూహంగా మారింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్(Cloud Coputing), సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో వేగంగా ముందుకు దూసుకెళ్లడానికి ఈ మార్పులు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్‌కు సన్నద్ధం
ఉద్యోగ కోతలతో పాటు, టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులను భవిష్యత్‌ ఆవిష్కరణలకు సిద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో శిక్షణ కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. గూగుల్‌ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) గతంలో ఒక సందర్భంలో, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల (కోటి) మందికి ఏఐ శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఏఐ సాంకేతికత ఇప్పటికే వైద్యం, విద్య, ఆర్థిక రంగం, రవాణా వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలను నేర్పించడం ద్వారా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నాయి.

టెక్‌ రంగంలో సవాళ్లు, అవకాశాలు
టెక్‌ రంగంలో ఉద్యోగ కోతలు ఒకవైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి కొత్త రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ కోతలు ఒక విధంగా కంపెనీలను మరింత సమర్థవంతంగా, పోటీతత్వంతో ముందుకు నడిపేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఉద్యోగులు కూడా నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. మైక్రోసాఫ్ట్‌ తాజా ఉద్యోగ కోతలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్‌ వ్యూహాలపై, ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version