Krishnamohan: సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఈ కోపిష్టి ఎవరు అసలేం చేస్తున్నారు తెలుసా..?

న్యూస్ రిహార్సల్స్ చేస్తున్న టైం లో ఒక వ్యక్తి పలికిన డైలాగ్స్ ఆయన హవ భావాలన్నింటితో కూడిన ఒక వీడియో బయటికి రావడం వల్ల ఒక వ్యక్తి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

Written By: Gopi, Updated On : January 4, 2024 11:14 am

Krishnamohan

Follow us on

Krishnamohan: సోషల్ మీడియా వల్ల ఏ రోజు ఎవరు ఏ స్థాయి లో ఉంటారో ఎవరికి అర్థం కావడం లేదు. వాళ్ళు చేసిన ఏదో ఒక పని వల్ల వాళ్ళకి తెలియకుండానే పాపులరిటి ని సంపాదించుకొని సెలబ్రిటీ లు గా మారుతున్నారు. ఏదైనా ఒక చిన్న వీడియో వైరల్ అయిందంటే చాలు వాళ్ళు సెలబ్రిటీగా మారిపోతున్నారు. ఇక దాంతోపాటుగా వాళ్ళ ఇంటర్వ్యూలను కూడా చేస్తూ వాళ్ళని సెలబ్రిటీ లానే ట్రీట్ చేస్తున్నారు.

ఇక అసలు విషయం ఏంటంటే న్యూస్ రిహార్సల్స్ చేస్తున్న టైం లో ఒక వ్యక్తి పలికిన డైలాగ్స్ ఆయన హవ భావాలన్నింటితో కూడిన ఒక వీడియో బయటికి రావడం వల్ల ఒక వ్యక్తి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే… ఆ న్యూస్ చదివేటప్పుడు ఆయనకి వచ్చే కోపం మొత్తం బయటకు చూపిస్తూ ఆయన పలికిన మాటలు ఇలా చేస్తే చెప్పే మూడు ఉత్సాహం అన్ని పోతాయి, తగలెట్టండి సార్ అంటూ సాగే కొన్ని డైలాగుల వల్ల బాగా పాపులర్ కి సంపాదించుకున్న వ్యక్తి కృష్ణమోహన్ అయితే ఈయనని కోపదారి మనిషి అని కూడా పిలుస్తూ ఉంటారు.

కానీ ఈయన అసలు పేరు మాత్రం కృష్ణమోహన్ అని తెలుస్తుంది. ఈయన చేసిన ఒక్క వీడియో వల్ల ఈయన బాగా పాపులర్ ని సంపాదించుకోవడమే కాకుండా ప్రతి ఒక్క మీంకి అతని వీడియోలని వాడుతూ వస్తున్నారు అది ఇంత పాపులారిటీని సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని ఒక డౌట్ అందరిలో నెలకొంది. అయితే కృష్ణమోహన్ గారు ప్రస్తుతం సింగం టీవీ అనే ఒక యూ ట్యూబ్ న్యూస్ ఛానల్ ని నడుపుతూ చాలా బిజీగా గడుపుతున్నారు. ఆయన ఏ పార్టీకి కొమ్ముకాయకుండా జనాలకి నిజాలు తెలియాలనే ఉద్దేశంతో నిజాలను మాత్రమే బయట పెడుతూ సింగం టీవీ ద్వారా వాస్తవాలను వెలికితీస్తు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకుంటున్నాడు…

మొత్తానికి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకొని నిజాలు నిక్కచ్చిగా చెప్పే ఒక చానల్ ని పెట్టుకొని తనకంటూ స్వతహాగా ఎదుగుతున్నందుకు అతన్ని చూసిన చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్లు కూడా లైఫ్ లో ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు…