Mahesh Babu Trivikram : మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో భారీ మార్పులు..!

Mahesh Babu Trivikram : మహేశ్ ఫ్యాన్స్ ఇక రిలాక్స్ కావచ్చు.. ఇన్నాళ్లు తమ అభిమాన హీరో లేటెస్ట్ మూవీ మొదలవుతుందా..? లేదా..? అని ఆందోళన పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇక ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేశ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా అనుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాకు ముహూర్తం కుదరడం లేదు. అయితే అందుకు కథలో మార్పులే కారణమని అన్నారు. […]

Written By: SHAIK SADIQ, Updated On : November 14, 2022 9:55 am
Follow us on

Mahesh Babu Trivikram : మహేశ్ ఫ్యాన్స్ ఇక రిలాక్స్ కావచ్చు.. ఇన్నాళ్లు తమ అభిమాన హీరో లేటెస్ట్ మూవీ మొదలవుతుందా..? లేదా..? అని ఆందోళన పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇక ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేశ్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా అనుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాకు ముహూర్తం కుదరడం లేదు. అయితే అందుకు కథలో మార్పులే కారణమని అన్నారు. త్రివిక్రమ్ రచించిన స్క్రిప్ట్ మహేష్ కు నచ్చలేదని సమాచారం. అంతేకాకుండా కొన్ని పాత్రలపై కూడా మనసు ఒప్పలేదని అన్నారు. అసలు విషయం తెలియదు.. కానీ తాజాగా కథతో పాటు కొన్ని పాత్రలను చేంజ్ చేయడంతో ఇక మహేశ్ సినిమా ముందుకు సాగుతుంది.

‘సర్కారు వారి పాట’తో మహేశ్ హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా మూడు సినిమాలు సక్సెస్ కావడంతో ఫ్యాన్ష్ జోష్ లో ఉన్నారు. అయితే మహేశ్ లేట్ చేయకుండా త్రివిక్రమ్ తో ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి కథ ఫైనల్ కాకపోవడంతోనే పెండింగులో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలు పాత్రలపై మహేశ్ కాస్త నిరాశతో ఉన్నట్లు గాసిప్స్ వచ్చాయి. అసలు విషయమేమిటో గానీ.. తాజాగా సినిమాకు సంబంధించిన కొన్ని మార్పులు చేశారు. దీంతో ఆ గాసిప్స్ నిజమే కావచ్చు అని అనుకుంటున్నారు.

తాజాగా మహేష్ సినిమా కోసం మలయాళ పృథ్వీ ని అనుకున్నారు. కానీ కానీ ఇప్పుడు ఆ నటుడు అవసరం లేదని తెలుస్తోంది. ఇక ఈసారి మాటల మాంత్రికుడు మహేశ్ తో కాస్త యాక్షన్ ఎక్కువే చేయించుకోనున్నట్లుు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేజీఎఫ్ ఫైటర్లను తీసుకురావాలని చూశాడట. కానీ వారి అవసరం కూడా లేదట. ఎందుకంటే త్రివిక్రమ్ తన కథలో చాలా మార్పులు చేశాడు. అనుకున్న విధంగా మహేశ్ ఫైట్స్ చేస్తాడు. కానీ అవే కీలకం కాకపోవచ్చు. వాటితో పాటు ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేశారు.

ఇందులో మరో పాపులర్ హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారు. కుదిరితే ఆమె మన హీరోతో జోడీ కట్టనుంది. ఆమెతో పాటు ఓ సీనియర్ హీరోయిన్ కూడా సినిమా కోసం పని చేయనుంది. ఇదిలా ఉండగా థమన్ గురించి తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం ఈయన బాణీలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుండు అని అనుకుంటున్నారట. అయితే త్రివిక్రమ్ కు మాత్రం థమన్ పైనే మనసు ఉంది. మరి ఆయన ఉంటారా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది. ఏదీ ఏమైనా గ్యాప్ తీసుకున్నా మహేశ్ సినిమా ఇక పట్టాలెక్కే సమయం రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.