Homeట్రెండింగ్ న్యూస్Taptapani Waterfall: ఉష్ణధార.. ఆ జలపాతంలో 360 రోజులూ వేడినీటి ప్రవాహం

Taptapani Waterfall: ఉష్ణధార.. ఆ జలపాతంలో 360 రోజులూ వేడినీటి ప్రవాహం

Taptapani Waterfall: వేసవి కాలంలో నీరు వేడెక్కుతుంది. శీతాకాలంలో చల్లగా మారుతుంది. కానీ అక్కడ ఏడాది పొడవునా నీరు వేడిగానే ఉంటుంది. 360 రోజులు సమ ఉష్ణ స్థితిలో ఉంటుంది. వినడానికి కాస్తా వింతగా ఉంది కదూ. నిజమేనండీ.. శతాబ్దాల కాలం నుంచి ఆ జలపాతానిది అదే ప్రత్యేకం. శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతం ‘తప్తపాని’జలపాతానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

Taptapani Waterfall
Taptapani Waterfall

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉంది ఈ జలపాతం. తప్తపాని పట్టణం భారతదేశంలోని అతి తక్కువ వేడి నీటి సల్ఫర్ బుగ్గలలో ఒకటి. ఔషధ గుణాలకు పేరుగాంచిన ఈ సల్ఫర్ వేడి నీటి బుగ్గలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు నయమవుతాయి. ఈ ప్రత్యేకతను గుర్తించిన ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగాను అభివ్రద్ధి చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో…గంజాం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది తప్తపాని. ఇక్కడి జలపాతం నుంచి జాలువారే నీరు నిత్యం వేడిగా ఉంటుంది. వేసవిలో వెళ్లినా, కఠిక శీతాకాలంలో వెళ్లినా అదే వేడి కనిపిస్తుంది. శ్రీరామలింగేశ్వర స్వామి నడయాడిన నేలగా అక్కడి స్థానికులు అభివర్ణిస్తుంటారు. జలపాతం సమీపంలో రామలింగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. జలపాతం నుంచి జాలువారిన నీటిని కొలనుకు మళ్లించి భక్తుల పవిత్ర స్నానాలు చేయడానికి అనుమతిచ్చారు. ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తలు ఇక్కడికి వస్తుంటారు. కొలనులో వేడి నీటిలో స్నానమాచరిస్తుంటారు. ఈ నీటితో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు దరిచేరవని భక్తుల ప్రగాడ నమ్మకం.

Also Read: Sudigaali Sudheer: పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్.. ఫీల్ అయిన రష్మీ.. రోజా వార్నింగ్..

Taptapani Waterfall
Taptapani Waterfall

సరిహద్దు ప్రాంతం కావడంతో ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ గడ్ నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కార్తీక మాసంతో పాటు మహా శివరాత్రి పర్వదినం నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. కార్తీక వన సమారాధనల సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కేంద్రానికి చేరుకోవాలంటే రోడ్డు, రైలు మార్గాలున్నాయి. రైలులో చేరుకోవాలంటే ఇచ్చాపురం కానీ బరంపూర్ కానీ చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తప్తపాని చేరుకోవచ్చు. నిత్యం ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గంలో చేరుకోవాలనుకున్న వారు. విశాఖ, శ్రీకాకుళంల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఇచ్ఛాపురం వరకూ ఉంటాయి. ఇచ్చాపురం నుంచి గంట వ్యవధిలో తప్తపాని జలపాతానికి చేరుకోవచ్చు.

Also Read:Sarubujjili Srikakulam District: ఆ ఊరికి దెయ్యం పట్టింది… గ్రామస్థులు బయటకు వెళ్లకుండా.. ఇతరులు గ్రామంలోకి రాకుండా రోడ్డు బ్లాక్

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version