Homeట్రెండింగ్ న్యూస్వైరల్: భూమిపై నూకలు ఉన్నాయ్.. మృత్యుంజయుడైయ్యాడు!

వైరల్: భూమిపై నూకలు ఉన్నాయ్.. మృత్యుంజయుడైయ్యాడు!

 

మనకు ఈ భూమిపై జీవించే అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదంనుంచైనా ప్రాణాలతో బయటపడగలుగుతాం. తాజాగా నాలుగేళ్ల బాలుడు అలాంటి అదృష్టానికి ఉదాహరణగా నిలిచాడు. శిథిలాల కింద పడి 18 గంటలు ఉన్నా బాలుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సోమవారం సాయంత్రం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

భవనం కూలిన ఘటనలో దాదాపు 75 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎన్.ఢీ.ఆర్.ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న 60 మందిని రక్షించగా 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ శిథిలాల కింద మహ్మద్ నదీమ్ బంగి అనే నాలుగేళ్ల బాలుడిని భవనం కూలిన 18 గంటల తరువాత గ్యాస్ కట్టర్ల సహాయంతో కడ్డీలను తొలగించి బయటకు తీశారు. ఘోర ప్రమాదం జరిగినా బాలుడు ప్రాణాలతో బయటపడటం గమనార్హం. అయితే బాలుడు బయటపడినా అతని కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ఘటన విషయంలో ఐదుగురిపై కేసు నమోదు చేయగా ఈ ఘటన తీవ్ర విషాదకరమైన విషయమని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో నిన్న రెండస్తుల భవనం కుప్పకూలగా శిథిలాల కింద నుంచి 9 మందిని వెలికి తీశారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular