Homeట్రెండింగ్ న్యూస్Dreams: కలలో ఇవి కనిపిస్తే ధనవంతులమవుతాం తెలుసా?

Dreams: కలలో ఇవి కనిపిస్తే ధనవంతులమవుతాం తెలుసా?

Dreams: కల అంటే స్వప్నం. ఇది రంగులమయంగా ఉంటుంది. కలవరపెట్టేలా కూడా ఉంటుంది. మనకు కలలు రావడం సహజమే. వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటే కలలు వస్తుంటాయి. కలలో మనం ఎక్కడికి వెళతామో తెలియదు. ఏదో ప్రమాదంలో చిక్కుకున్నట్లు భయం కలుగుతుంది. ఇలా ఎన్నో రకాల కలలు మనల్ని కవలవరపెడుతుంటాయి. మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకంగా అనారోగ్యం దరిచేరినప్పుడు మరోలా కలలు వేధిస్తుంటాయి. మనస్తత్వ నిపుణుల ప్రకారం కలలు మన భవిష్యత్ ను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. కలలో మంచి అయినా చెడు అయినా మనకు సంకేతాలు మాత్రం ఇస్తుంటాయి.

Dreams
Dreams

మనకు వచ్చే కలలు మనకు గుర్తుండవు. కలలో మనం ఏం చేస్తామో కూడా తెలియదు. మెలకువ వచ్చాక చూసుకుంటే అంతా మరిచిపోతాం. అప్పటివరకు వచ్చిన కల మనకు గుర్తుకు రాదు. కానీ కలలో మనకు నిజజీవితంలో జరిగనివి ఎన్నో జరుగుతాయి. కొందరేమో మంచి కలలు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఏవో గందరగోళంగా వచ్చినప్పుడు మాత్రం భయపడుతుంటారు. కలలో జరిగిన సంఘటనలు చాలా వరకు మనకు గుర్తుకు వచ్చే అవకాశాలు తక్కువ.

కలలో కనిపించే వ్యక్తులు, వస్తువుల్ని కొన్ని సార్లు గుర్తిస్తుంటాం. భయంకరమైన కలలు వచ్చినప్పుడు మాత్రం వాటిని మరిచిపోయేందుకే ప్రయత్నిస్తాం. కలలో శుభ సంకేతాలు ఇచ్చే కలలు మనకు భవిష్యత్ లో ధనవంతులం అవుతామని సూచిస్తాయి. పీడ కలలు వస్తే మనకు చెడు జరుగుతుందని తెలియజేస్తాయి. ఇలా కలలు మనకు ఎన్నో విషయాలు సూచనప్రాయంగా చెబుతుంటాయి. కలలో మనకు తామరపువ్వు కనిపిస్తే మనం ధనవంతులం అవుతామని సంకేతం.

Dreams
Dreams

భవిష్యత్ లో లక్ష్మీదేవి ఆశీర్వాదం మనపై ఉండబోతోందని అర్థం. త్వరలో మనం బాగా డబ్బు సంపాదిస్తామని కూడా దీనికి నిదర్శనం. కలలో తేనెపట్టు కనిపించినా తేనెటీగలు తారసపడినా అది శుభాలు కలిగిస్తాయని నమ్ముతుంటారు. మాధుర్యం కలిగిన తేనెను అందించే తేనెటీగలు కనపించడం వల్ల మనకు జీవితంలో చాలా ఆనందాలు రాబోతున్నాయని తెలుస్తోంది. అయితే తామరపువ్వు, తేనెటీగలు అందరికి కనిపించవు. అది అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కలలో మనకు కనిపించే వాటితో కూడా మన అదృష్టం మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version