Bigg Boss Non Stop OTT Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా బిందుమాధవి? ఓటింగ్ లో టాప్ లేపిన ఆడపులి?

Bigg Boss Non Stop OTT Winner: ఓటీటీ వేదికగా సాగుతున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విజేత ఎవరో తేలిపోయింది. సోషల్ మీడియాలో ఈసారి లేడీ విన్నర్ అని ఖాయమైనట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఏడుగురు సభ్యులు గ్రాండ్ ఫినాలేలో పోటీ పడుతారని అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఐదుగురు మాత్రమే ఫైనల్ లో మిగిలారు. ఫైనల్ ఫైట్ లో ఈ ఐదుగురి మధ్యలో విజేత ఎవరన్నది ఉత్కంఠగా మారింది. […]

Written By: NARESH, Updated On : May 20, 2022 10:34 am
Follow us on

Bigg Boss Non Stop OTT Winner: ఓటీటీ వేదికగా సాగుతున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విజేత ఎవరో తేలిపోయింది. సోషల్ మీడియాలో ఈసారి లేడీ విన్నర్ అని ఖాయమైనట్టు తెలిసింది. ఇప్పటి వరకు ఏడుగురు సభ్యులు గ్రాండ్ ఫినాలేలో పోటీ పడుతారని అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఐదుగురు మాత్రమే ఫైనల్ లో మిగిలారు. ఫైనల్ ఫైట్ లో ఈ ఐదుగురి మధ్యలో విజేత ఎవరన్నది ఉత్కంఠగా మారింది. టాప్ 2 ప్లేసుల్లో బిందుమాధవి, అఖిల్ సార్థక్ లు హోరాహోరీగా కొనసాగారు. చివరకు బిందుమాధవినే విజేతగా నిలిచినట్టుగా సమాచారం. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ విజేతగా బిందుమాధవి ఖాయం కావడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

bindu madhavi

ఈ వారం వరకు బిగ్ బాస్ హౌజ్ లో బిందుమాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఏడుగురిలో ఇద్దరు బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ లు ముందుగా బయటకు వచ్చారు. దీంతో ఇప్పుడు ఐదుగురి మధ్యే పోటీ నెలకొంది. ఎనిమిది వారాలుగా సాగుతున్న ఈ సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఇప్పుడున్న ఐదుగురు సభ్యుల్లో ఇద్దరిని టాప్ 2గా ఎంపిక చేశారు. ప్రస్తుతానికి టాప్ ప్లేసులో బిందుమాధవి, అఖిల్ సార్థక్ లు కొనసాగుతున్నారు. ఒకవేళ ఓటింగ్ శాతం మారితే వీరి ప్లేసులోకి మరొకరు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం బిందుమాధవి, అఖిల్ సార్థక్ లు ఫస్ట్, సెకండ్ ప్లేసులో కొనసాగుతున్నారు.

Also Read: Jr NTR Birthday: జూ ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానుల నీరాజనాలు

ఆదివారం అర్ధరాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ప్రారంభం కాగా.. బుధవారం అర్థరాత్రితో ఓటింగ్ లైన్స్ ముగిశాయి. నాలుగు రోజుల పాటు నువ్వానేనా అన్నట్టుగా అఖిల్-బిందుమాధవిల మధ్య హోరాహోరీ పోరు సాగింది. గంటగంటకు లెక్కలు మారిపోయాయి. ఈ పోరులో చివరకు వచ్చేసరికి బిందుమాధవి పైచేయి సాధించి అఖిల్ కంటే ఎక్కువ ఓట్లు రాబట్టడంతో ఆమెనే విజేతగా అవతరించబోతోందని సమాచారం. అఫీషియల్ పోల్ తోపాటు అనధికార పోల్స్ చాలా వాటిలో బిందుమాధవి టాప్ ప్లేసులో కొనసాగుతోంది. అఖిల్ రెండోస్థానానికి పరిమితమయ్యాడు. వీళ్లదరి మధ్య వ్యత్యాసం బుధవారం వరకూ చాలా తక్కువనే ఉన్నా.. బుధవారం అర్థరాత్రికి వచ్చేసరికి ట్రెండ్ మారిపోయింది. బిందు పుంజుకొని దూసుకొని రావడంతో ఆమెనే విజేతగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

bindu madhavi

ఈవారం హౌస్ లో ‘మేజర్’ ప్రమోషన్ చేశారు. ఇందులో భాగంగా అడవిశేషు సందడి చేశారు. గతంలో అడవిశేషు హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంటే. దీంతో ఆయన కనిపించగానే హౌస్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. అడవిశేషుతో పాటు మరికొందరు సినిమా యూనిట్ సభ్యులు కూడా వచ్చారు. సినిమా గురించి విశేషాలు చెప్పారు. అంతేకాకుండా విన్నర్ కాబోయే వారికి ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు.

bindu madhavi

గత కొన్ని వారాల నుంచి బిందుమాధవి, అఖిల్ సార్థక్ ల మధ్యే పోటీ నెలకొంది. వీరి ప్లేసును భర్తీ చేసేందుకు యాంకర్ శివ ట్రై చేస్తున్నాడు. కానీ ఆయన మూడో స్థానంలోనే కొనసాగుతున్నారు. అయితే యాంకర్ శివ కూ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఓవరాల్ గా చూస్తే ఫైనల్ స్టేజీ ఎక్కేది మాత్రం బిందుమాధవి, అఖిల్ సార్థక్ లే అంటున్నారు. ఇద్దరిలో బిందుమాధవికే విజేత అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ బిందుమాధవి టైటిల్ గెలిస్తే మొదటిసారి గెలిచిన లేడీగా రికార్డు సృష్టిస్తుంది. ఏం జరుగుతుందన్నది కొన్ని గంటల్లోనే తేలనుంది.

Also Read:Rashmika Mandanna: స్పోర్ట్స్ వేర్ లో రష్మిక హాట్ సెల్ఫీ.. ఘాటు ఫోజులు వైరల్

Tags