Homeట్రెండింగ్ న్యూస్Bhoshanam : తవ్వకాల్లో బయటపడ్డ భోషాణం.. కష్టపడి ఓపెన్ చేసి చూస్తే షాక్

Bhoshanam : తవ్వకాల్లో బయటపడ్డ భోషాణం.. కష్టపడి ఓపెన్ చేసి చూస్తే షాక్

Bhoshanam : కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కరివేవుల గ్రామంలో ఓ వింత చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుంటే ఓ భోషాణం బయట పడింది. దీంతో అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయేమోననే ఉత్కంఠతో ఊరంతా గుమిగూడారు. దాన్ని తెరిచేందుకు రెండు రోజులు శ్రమించారు. సుత్తి, కట్టర్ తో దాన్ని పగులగొట్టారు. తీరా చూస్తే అందులో ఏమీ లేదు. అందరికి ఏవో ఆశలు ఉంటాయి. అందులో వజ్రాలు, బంగారం ఉందేమోననే ఆశతో ఊరంతా అక్కడే ఉన్నారు. దాన్ని తెరిచే వరకు ఎవరు కూడా అక్కడ నుంచి కదలలేదు.

గుప్త నిధులపై అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. తమకు గుప్త నిధులు దొరికితే బాగుండు రాత్రికి రాత్రే ధనవంతులం అయిపోవచ్చు అనుకుంటారు. కానీ అదంత సులభం కాదు. అవి ఎక్కడుంటాయో ఎవరికి తెలియదు. కొందరైతే నరబలులు కూడా ఇచ్చిన సంఘటనలున్నాయి. నిధులు దొరుకుతాయో లేదో కానీ వారు మాత్రం జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం. అత్యాశ దుఖానికి చేటని తెలిసినా ఆ ప్రయత్నాలు మానరు. అడ్డదారుల్లో అందలాలెక్కాలని అందరు ఆశపడుతుంటారు.

ఇందులో భాగంగానే కరివేవుల గ్రామంలో కనిపించిన భోషాణం గురించి అందరు చర్చించుకున్నారు. కచ్చితంగా అందులో బంగారు నిధులు ఉన్నాయనే ఊహల్లోనే విహరించారు. పురాతన కాలం నాటిది కావడంతో దాన్ని తెరిచేందుకు చాలా శ్రమించారు. తీరా తెరిచాక చూస్తే అందులో ఏముంది పాత కాగితాలు తప్ప ఏమి కనిపించలేదు. ఆ ఇంటి యజమాని వెళ్లిపోయేటప్పుడు దాన్ని అక్కడే వదిలేసి పోవడంతో అది బురదలో కూరుకునిపోయింది. దాన్ని తెరిచిచూస్తే ఏమీ లేదు.

భోషాణం కనిపించగానే ఊరంతా ఒక్క చోట చేరింది. అందులో విలువైన వస్తువులు ఉంటాయోమోనని ఆశగా చూశారు. ఏమి లేకపోయే సరికి నిట్టూర్చుకుని వెళ్లిపోయారు. తామెంతో ఊహించుకున్నామని అనుకుంటున్నారు. ఏవేవో అనుకుంటే ఏదో జరిగినట్లు అందులో బంగారం ఉంటుందని అనుకుంటే వట్టి కాగితాలే దర్శనమిచ్చాయి. మనుషుల ఊహలకు అంతుండదు. ఆలోచనలకు అదుపు ఉండదు. ఏదైనా కనిపిస్తే చాలు దానిపై ఏవేవో అంచనాలు వేసుకుని అక్కడే ఉండటం కామన్ గా మారింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
Oktelugu Epaper
Exit mobile version